కడ్తాల్ : అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారి కోసం ఆమనగల్లు సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వారందరూ రక్తదానం చేయవచ్చని, రక్తదానం చేయడంతో వేరోకరి ప్రాణాలను నిలబెట్టవచ్చన్నారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అవసరమైనప్పు డు రక్తదానం చేయాలన్నారు.
సమాజంలో రక్తదానంపై ఉన్న అపోహలు తొలగిపోవాలని, ప్రజల్లో చైతన్యం వచ్చేలా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శిబిరంలో 51మంది రక్తదానం చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మండలంలోని రేశ్యాతండాకు చెందిన లచ్చికి రూ. 8వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్సైలు హరిశంకర్గౌడ్, ధర్మేశ్, వరప్రసాద్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పరమేశ్, మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, సర్పంచ్లు హరిచంద్నాయక్, తులసీరాంనాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వెంకటేశ్, నాయకులు గంప శ్రీను, జహంగీర్ అలీ, లాయక్ అలీ, విఠలయ్య, డాక్టర్ శ్రీనివాస్, గణేశ్గౌడ్, భిక్షపతి, రమేశ్, రాజు, దేవానాయక్, శ్రీకాంత్, సతీశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.