పెద్దేముల్, ఏప్రిల్ 21 : నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనంత య్య తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఓమ్లానాయక్ తండాకు ప్రతి రోజూ కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో నల్లబెల్లం సరఫరా అవుతుందని సమాచారం అందింది. గురువారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు ఓమ్లానాయక్ తండా సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు.
ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం కుంచారం నుంచి ఓమ్లానాయక్ తండాకు చెందిన రాథోడ్ పాండు ఆటోలో 280 కేజీల నల్లబెల్లాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి, నిందితుడిని కోర్టులో హాజరు పర్చాం. తనిఖీల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకాంత్ రెడ్డి, సిబ్బంది కిశోర్, భీమ య్య తదితరులు పాల్గొన్నారు.