వికారాబాద్/మోమిన్పేట, డిసెంబర్ 23: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జరుగు తున్న పనులను ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన వికారాబాద్ మండలంలోని పులుమద్ధి గ్రామ జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న పనులను అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా మోమిన్పేట మండలంలోని చంద్రయాన్పల్లి, అమ్రాదికుర్దు గ్రామాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న పనులను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చు ట్టిందన్నారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని బడుల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కోట్లాది రూపాయలతో పాఠశాలల్లో మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మా ణం, తాగునీటితోపాటు ప్రహరీలను నిర్మిస్తున్నదన్నా రు. పులుమద్ధి గ్రామ జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలలు, చంద్రయాన్పల్లి, అమ్రాదికుర్దు గ్రామాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచిం చా రు. ఆయన వెంట డీఈవో రేణుకాదేవి, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, డీఈ శ్రీధర్రెడ్డి, మండలాల విద్యాధికారులు బాబుసింగ్, గోపాల్, ఎంపీడీవో శైలజారెడ్డి, సర్పంచ్లు మాధవరెడ్డి, అంజయ్య, సునీతామల్లేశ్, అధికారులు, సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
గడువులోపు పూర్తి చేయాలి
నవాబుపేట, డిసెంబర్ 23: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను గడువులోపు పూర్తి చేయాలని టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శుక్రవారం వారు మండలంలోని మాదారం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జరిగిన అభి వృద్ధి పనులను కలియతిరిగి పరిశీలించారు. అనం తరం పాఠశాల వివరాలను ఉపాధ్యాయులు, మం డల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్క డ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం బడులను అభివృద్ధి చేస్తున్నదన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల బోధనాసామర్థ్యాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, ఎంపీడీవో సుమిత్రమ్మ, ఎంఈవో గోపాల్, ఎస్ఎంసీ చైర్మన్ లావణ్య, హెచ్ఎం ప్రమీల, గ్రామపంచాయతీ కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య ..
తాండూరు రూరల్, డిసెంబర్ 23: బడుగు, బలహీన వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గౌతాపూర్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ‘మన ఊరు-మన బడి’ పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో జరిగిన పనులను పరిశీలించి.. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఈవో రేణుకాదేవి, ఎంఈవో వెంకటయ్య, సెక్టోరల్ అధికారులు రవి, శేఖర్, హెచ్ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.
‘మన ఊరు- మన బడి’ పనులు భేష్
కోట్పల్లి, డిసెంబర్ 23: మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు భేషుగ్గా ఉన్నాయని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. అన్నాసాగర్ గ్రామంలో ‘మన ఊరు- మన బడి’ నిధులు రూ.నాలుగు లక్షలు, ఉపాధిహామీ పథకం కింద 18 లక్షల 20 వేల నిధులతో స్థానిక పాఠశాలలో మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీటితోపాటు ప్రహరీని నిర్మించగా..పరిశీలిం చిన వారు పనులు బాగున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీ ఈవో రేణుకాదేవి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ చాణక్య, ఎంఈవో చంద్రప్ప, సర్పంచ్ రాధాకృష్ణ, టీచర్ మౌనిక, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన వసతులు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నదని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కందనెల్లి గ్రామ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నదన్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఈఓ రేణుకాదేవి, రాజు, ఎంఈవో వెంకటయ్య, ఎస్వో రవి, శేఖర్, ప్రధానోపాధ్యాయురాలు వారిజ, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.