దళితబంధు పథకం దళితుల పాలిట వరంగా మారుతున్నది. ఇదివరకు కూలీనాలి చేసుకునేవారు.. ఈ పథకంతో వ్యాపారులుగా మారుతున్నారు. కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో మల్ల ఉమాదేవీనర్సింహులు దంపతులు దళితబంధు డబ్బులతో పౌల్ట్రీఫామ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫామ్ను శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఇబ్బందులను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితులను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుని వారి అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు.
-కోట్పల్లి, ఏప్రిల్ 28
కోట్పల్లి, ఏప్రిల్ 28 : దళితులను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని దళితులకు సూచించారు. శుక్రవారం మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో మల్ల ఉమాదేవీనర్సింహులు దంపతులకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన పౌల్ట్రీఫామ్ యూనిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినా దళితుల తల రాతను మార్చలేదన్నారు. దళితుల ఇబ్బందులను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థి క సాయాన్ని అందిస్తూ.. స్వయం ఉపాధిని కల్పిస్తున్నారన్నారు. లబ్ధిదారులు తమకు మంజూరైన యూనిట్లను సక్రమం గా నిర్వహిస్తూ ఆర్థికాభివృద్ధిని సాధించడంతోపాటు పది మందికి ఉపాధిని కల్పించాలని సూచించారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో దళితులను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుని వారి అభివృద్ధిని విస్మరించారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. మొదటి దశలో మండలంలో 17 లబ్ధిదారులకు యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసినట్లు తెలిపారు. దశల వారీగా దళితులందరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని.. అందువల్ల ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు మాకు కూడా తెలంగాణలో కొనసాగుతున్న పథకాలను అందించాలని ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. తెలంగాణలో కొనసాగుతున్న పథకాలను దేశంలోని ప్రజలందరికీ అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లోకి వెళ్లారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్గౌడ్, సత్యం పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
మాది నిరుపేద కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద నన్ను లబ్ధిదారుడి గా ఎంపిక చేసి.. రూ. పది లక్షలను మం జూరు చేసింది. వచ్చిన ఆ మొత్తంతో పౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేసుకున్నా. కష్టపడి పని చేసి ఆర్థికంగా ఎదుగుతా. గతంలో కుటుంబాన్ని పోషించేందుకు అనేక వ్యాపారాలు చేసినా అప్పులే మిగిలాయి. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ దళితబంధు పథకం కింద లబ్ధిదారుడిగా ఎంపిక చేసి నాకో దారి చూ పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్కు, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మల్ల నర్సింహులు, మోత్కుపల్లి