పరిగి, ఏప్రిల్ 23: బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని, కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమాజ స్థాపనకు కృషి చేసిన సమతామూర్తి అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బసవేశ్వరుడి జయంతి సందర్భంగా పరిగిలోని బసవేశ్వరుడి విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ నూతన సంస్కరణలకు నాంది పలికిన బసవేశ్వరుడి పంథా నేటికీ అనుసరణీయమన్నారు. బసవేశ్వర భవనానికి ఎమ్మెల్యే రూ.10లక్షలు విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మ న్ భాస్కర్, నాయకులు రవి, వీరశైవ సమాజం నాయకులు ఈశ్వరప్ప, శివరాజ్, జగదీశ్వర్ పాల్గొన్నారు
వికారాబాద్: దేహమే దేవాలయం అని చాటి చెప్పిన విశ్వ గురువు బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్లోని బస వేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బసవేశ్వర విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించి బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సమసమాజ నిర్మాణానికి కృషి చేసిన బసవేశ్వర ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ తదితరులు ఉన్నారు. అలాగే వికారాబాద్ ఎంఆర్పీ చౌరస్తాలో గల బసవేశ్వర స్వామి విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజులా రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో కౌన్సిలర్ కిరణ్ పటేల్, వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.
తాండూరు: తాండూరులో వీరశైవ సమాజం ఆధ్వ ర్యంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి రాజకీయ పార్టీల నేతలు, వీరశైవులు పూల మాలలు వేసి పూజలు చేశారు. కందనెల్లి, బెల్కటూర్లో ఉన్న బస వేశ్వరుడి విగ్రహానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీసీ సంఘం నేతలు, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో అధికారికంగా బసవేశ్వరుడి జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వీరశైవుల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, పట్టణ పురప్రముఖులు పాల్గొన్నారు.
పెద్దేముల్: సమాజంలో నివసిస్తున్న ప్రతి మనిషి అందరితో సమానమని చాటి చెప్పింది బసవేశ్వరుడని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు.ఆదివారం మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో నిర్వహించిన బసవ జయంతిలో పాల్గొని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమభావన, అంటరానితనం, లింగ, కులవివక్షలను రూపుమాపడంలో బసవేశ్వరుడి కృషి గొప్పదన్నారు. వీరశైవ లింగాయత్లకు బసవేశ్వర స్వామి ఆరాధ్య దైవమన్నారు.అనంతరం వీరశైవ సమాజం ప్రతినిధులు శుభప్రద్ పటేల్ను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు శివకుమార్, కందనెల్లి అధ్యక్షుడు రేషం సిద్దేశ్వర్, సర్పంచ్ మోహన్రెడ్డి, తాండూరు పోట్లీ మహరాజ్ దేవస్థానం ధర్మకర్త సిద్ది రామప్ప, జర్నలిస్ట్ శ్రీనివాసా చారి, మహేశ్, వెంకటయ్య పాల్గొన్నారు.
కొడంగల్: కుల వ్యవస్థ, వర్ణభేదాలు, లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయ వాది బసవేశ్వరుడని మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, రావులపల్లి సర్పంచ్ రమేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం బసవ జయంతిని మం డల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజలు ఘనంగా జరుపు కొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని రావులపల్లి గ్రామంలో పెద్ద ఎత్తన బస వేశ్వరుడి జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ మాజీఅధ్యక్షుడు బస్వరాజ్లతో పాటు వీరశైవ లింగాయత్ సభ్యు లు, సిబ్బంది పాల్గొన్నారు.
బొంరాస్పేట: బొంరాస్ పేట, దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామాల్లో వీరశైవులు బసవేశ్వరుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బసవేశ్వరుని బోధనలు అనుసరణీయమని వక్తలు అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జగదీశ్, వీరేశం, సంతోష్, శేఖర్, జగదీశ్వర్, ఉమాపతి, శశిధర్, మల్లికార్జున్, రాజ్కుమార్, సంగమేశ్, శంకర్లింగం తదితరులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు బాలంపేట గ్రామంలో బసవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో తిరుమల స్వామి, బీఆర్ఎస్ నాయ కుడు మల్లేశం, వీరశైవ సమాజ అధ్యక్షుడు శివకుమార్, రాచప్ప, గురువెంకట్రావు, అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల: కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో వీరశైవలింగాయత్లు, నాయకులు బసవేశ్వర జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బసవేశ్వరుడి బోధన ల గురించి వివరించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశమందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు కరణం ప్రహ్లాద్రావు, పీరంపల్లి రాజు, జానకీరాం, వీరశైవలింగాయత్ పాల్గొన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజు, తహసీల్దార్ అశోక్కుమార్, గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి, నాయకులు మఠం రాజశేఖర్, అశోక్కుమార్, లింగయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
దోమ: మనుషులందరూ ఒక్కటే అని చాటి చెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో బసవేశ్వరుడి విగ్రహానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో రామలింగేశ్వర ఆలయం చుట్టూ బసవేశ్వరుడి పల్లకీ సేవను మఠం వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్లు నిర్వహించి బసవ జయంతి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో దిర్సంపల్లి ఎంపీటీసీ నవాజ్రెడ్డి, సర్పంచ్ శాంతారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్, బడెం పల్లి సర్పంచ్ కవితాశ్రీనివాస్రెడ్డి, మచ్చెందర్రెడ్డి బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్ రాములు, కొండారెడ్డి, హన్మంతు, టిల్లు, అశోక్, దంపతులు మంతటి అన్నపూర్ణ రామలింగం,ఆవుటి అనిత సిద్ధిరాములు,జిన్గుర్తి అశోక్ కుమార్, రాచప్ప, ఎస్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
కోట్పల్లి: కోట్పల్లి మండల కేంద్రం పాత ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని బసవేశ్వర విగ్రహానికి వీరశైవ సమాజ సంఘం సభ్యులు ఎల్ విజయ్కుమార్ తది తరులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గద్దె సురేశ్, చిత్ర శేఖర్, పత్తి సంఘమేశ్వర్, పత్తి అమర్నాథ్, కొవురి వైద్య నాథ్ పాల్గొన్నారు.