త్యాగానికి ప్రతీకగా నిర్వహించే బక్రీద్ పండుగను గురువారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఈద్గాలు, మసీద్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయమే నూతన వస్ర్తాలు ధరించి అక్కడకు వెళ్లిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలయ్బలయ్ చేసుకొని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.
రకరకాల టోపీలు ధరించిన పిల్లలు సందడి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత పెద్దలు ఖురాన్ బోధనలను, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. త్యాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలోని మానవులంతా సమానమనే విషయాన్ని సూచిస్తుందని మత పెద్దలు చెప్పారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్