కులకచర్ల : డాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. మరికల్ గ్రామ సర్పంచ్ పాండురంగయ్య గురుస్వామి, గ్రామానికి చెందిన గురుస్వాములు, అయ్యప్పస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. కాగా గ్రామంలో హనుమాన్ దేవాలయ పునఃనిర్మాణానికి రూ. 50వేలు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మరికల్ గ్రామసర్పంచ్ పాండురంగయ్యకు అందజేశారు.
కార్యక్రమంలో డాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, జడ్పీటీసీ రాందాస్నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, గ్రామస్తులు, అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.