తాండూరు : తాండూరు పట్టణం ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో బుధవారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి కుమారుడు రినీశ్రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పడి పూజలో భాగంగా స్వామియే… శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామికి దీపారాధన చేస్తు మొక్కులు చెల్లించుకున్నారు. పూజలో అయ్యప్ప నామస్మరణ, భక్తులు ఆలాపించిన పాటలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. 5లక్షల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పడి పూజలో రాజకీయ పార్టీల నేతలు, అయ్యప్పస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.