వికారాబాద్, జనవరి 25 : వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్లో పాల్గొని జరుగుతున్న ఏర్పాట్లు, పోలీసుల పరేడ్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఆర్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.