రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బోదకాల(ఫైలేరియా) బాధితులు ఉండొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి డీఏపీ, అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఫైలేరియా ప్రభావిత ప్రాంతా లు, ర్యాండమ్గా మరికొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి జిల్లా వైద్యారోగ్య అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఫైలేరియా పాజిటివ్ కేసులు ఉన్న వారి ఇంటి చు ట్టూ 50 నుంచి 80 ఇండ్లల్లో, పాఠశాలల్లోని ఒకటి నుంచి రెండోతరగతి చదువుతున్న పిల్లల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో ని ఆమనగల్లు డివిజన్లో(తలకొండపల్లి, గట్టుఇప్పలపల్లి, ఆమనగల్లు), షాద్నగర్ డివిజన్లో (చిచ్చోడ్, కొత్తూరు, నందిగామ), కొందుర్గు డివిజ న్ (కొందుర్గ్గు, బూర్గుల, కేశంపేట)లలో చిన్నారులు, నుంచి రక్త నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించి ఫైలేరియా తీవ్రతను అంచనా వేస్తున్నారు.
ఫైలేరియా వ్యాధిని గుర్తించేందుకు ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే (టీఏఎస్)-3ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధి కారులు నిర్వ హిస్తు న్నారు. జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఒకటి నుంచి రెండోతరగతి చదువుతున్న చిన్నారుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా లో ఫైలేరియా కేసు లు పెద్ద మొత్తంలో నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై తలకొండపల్లి, ఆమనగల్లు, షాద్నగర్ డివిజన్లోని మొత్తం మండలాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. కాగా ఫైలేరియా వ్యాధి క్యూలెక్స్ దోమల (పరాన్నజీవి)తో సంక్రమిస్తుంది.
రంగారెడ్డి డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఆమనగల్లు డివిజన్లో మార్చి 27 నుంచి ఈ నెల 3 వరకు 64 మంది విద్యార్థుల నుంచి రక్తనమూనాలను అధికారులు సేకరించగా.. పాజిటివ్ కేసు ఒకటి కూడా నమోదు కాలేదు. షాద్నగర్ డివిజన్లో 345 మంది విద్యార్థుల రక్త నమూనాల ను సేకరించగా పాజిటివ్ కేసు ఒకటి నమోదైంది. అదేవిధంగా కొందుర్గు డివిజన్ పరిధిలో 96 మంది విద్యార్థుల నుం చి రక్త నమూనాలను సేకరించి, పరీక్షించగా ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలే దు. జిల్లాలో 556 మంది విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి, పరీక్షించేలా డీఎంహెచ్వో లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే పాఠశాలల్లోని 505 మంది విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించింది. ఫైలేరియా నిర్మూలన కు జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తున్నది. జిల్లాలో బోదకాల నిర్మూలనకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా ఫైలేరియా ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి అవసరమైన వారికి డీఏపీ, అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయ నున్నాం. ఇప్పటివరకు షాద్నగర్, ఆమనగల్లు, కొందుర్గు డివిజన్ల పరిధిలో పలువురు విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించడం జరిగింది. దాదాపుగా జిల్లాలో ఫైలేరియా వ్యాధి నియంత్రణలోనే ఉన్నది.
– డాక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో రంగారెడ్డి