ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 10 : మూగజీవాల సంరక్షణతో పాటు, వాటి పెంపుకోసం రైతులు పశుసంవర్ధకశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట్ గ్రామంలో ఇబ్రహీంపట్నం పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు వసంతకుమారి ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశ సంబంధిత చికిత్సలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజిలప్ప హాజరై రైతులకు పలు రకాల సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ సంచాలకులు విజయ్కుమార్రెడ్డి, ఎలిమినేడు పశువైద్యాధికారి సురేష్బాబు, జిల్లా పశుగ్రామీణాభివృద్ధి సంస్థకు చెందిన అధికారులు కవిత, గోపాలమిత్రులు జగన్, నర్సింహ, పశువైద్య సిబ్బంది సౌమ్య పాల్గొన్నారు.