తాండూరు రూరల్ : తాండూరు మండలం, చెంగోల్ గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహా స్థాపన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఆదివారం వైభవంగా మహోత్సవాలు జరిగాయి. కళాకారులు నృత్యం చేస్తూ భారీ ఊరేగింపుగా ఆలయానికి విచ్చేశారు.
వేద పండితుల సమక్షంలో శంకర్యాదవ్ ఆధ్వర్యంలో గణపతిపూజ, గౌరిపూజ, రంగాపూజ, నాంది సమారదనం, అష్టదిక్పాలకుల పూజ, జలాధివాసం, ధాన్యదివాసము, పుష్పాదివాసము మహామంగళహరిత వంటి కార్యక్రమాలు చేశారు. భక్తులు వచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.