వికారాబాద్, జనవరి 1 : అనంతపద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్తులు, పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ ఏడాదిలో సంతోషంగా జీవించాలంటూ వేడుకున్నా రు. మహిళలు ఉసిరిచెట్టు వద్ద పూజలు చేశారు.
దర్శనం అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో సేద తీరారు. పలువురు భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగా రు. అనంతరం ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతిఒడిలో పర్యాటకులు నందిఘాట్ వద్ద సందడి చేశారు. ట్రెక్కింగ్ చేస్తూ యువతీయువకులు ఉత్సాహంగా గడిపారు. న్యూఇయర్ సందర్భంగా స్నేహితులు ఒకరికొకరు విషెష్ చెప్పుకొన్నారు. వెంట తెచ్చుకున్న పదార్థాలను అటవీ ప్రాంతంలో కుటుం బ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అదేవిధంగా వికారాబాద్ సమీపంలో ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. మండలంలోని పులుసుమామిడి గ్రామ సమీపంలో ఉన్న పార్వతీపరమేశ్వరుడి గుట్టపై సోమవారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రత్యేకపూజలు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్లు కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
ప్రతి ఇంటా నూతన కాంతులు విరజిమ్మాయి. గెస్ట్హౌస్లు, అవుట్డోర్ పార్టీలు.. డీజేల మోతలు యువతను ఉర్రూతలూగించాయి. సంబురాలు అంబరా న్నంటిన వేళ.. న్యూ ఇయర్ను ఘనంగా ఆహ్వానిం చారు. నూతన ఏడాదిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ఈ ఏడాదిలో అంతా మంచే జరుగాలని దేవుళ్లను వేడుకున్నారు.