ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 12 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈనెల 16న చైర్పర్సన్పై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరుగాల్సి ఉన్నది. 17మంది కౌన్సిలర్లతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసింది.
మొత్తం 24 మంది కౌన్సిలర్లలో విశ్వాస పరీక్షను నెగ్గాలంటే 16 మంది సభ్యుల మద్దతు అవసరం. 17 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు పెట్టడంతో ఆమె పదవి నుంచి దిగడం ఖాయమని బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ధీమాగా ఉన్నా రు. గత 20 రోజులుగా వారు క్యాంపునకు వెళ్లారు. అయితే క్యాంపులో ఉన్న ఇద్దరు కౌన్సిలర్లు చైర్పర్సన్ వర్గం వైపు వెళ్లారు.
జంప్ అయిన శంకరయ్య,
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు పెట్టిన ఖానాపూర్ గ్రామానికి చెం దిన కౌన్సిలర్ శంకరయ్య, ఇబ్రహీంపట్నంలోని 24వ వార్డు కౌన్సిలర్ జెర్కోని బాలరాజు సోమవారం బీఆర్ఎస్, బీజేపీ వర్గం నుంచి చైర్పర్సన్ స్రవంతి వర్గం వైపు జంప్ అయ్యారు. దీంతో బలపరీక్షలో విజయం సాధించేందుకు అవసరమైన సంఖ్యాబలం చైర్పర్సన్ వ్యతిరేక వర్గానికి లేకుండా పోయింది. ఆ వర్గంలో ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారు. చైర్పర్సన్ వర్గం వైపు ఆమెతోపాటు ఎనిమిది మంది సభ్యులున్నారు. దీంతో కప్పరి స్రవంతికి పదవిగండం తప్పినైట్లెంది. చైర్పర్సన్తో పాటు మిగిలిన సభ్యులు ప్రత్యేక క్యాంపుకెళ్లారు. ఈనెల 16వరకు అక్కడే ఉండనున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రక్తికట్టిస్తున్నది. ఆమెను పదవి నుంచి దించేందుకు వ్యతిరేక వర్గం వారు నెలరోజులుగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆశీస్సులతో పదవిని కాపాడుకునేందుకు చైర్పర్సన్ అనేక ఎత్తులు వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ శంకరయ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. క్యాంపులో ఉన్న శంకరయ్య ఆదివారం మంచాల మండలంలోని రంగాపూర్లో తన అత్తగారి అంత్యక్రియలకు హాజరు కాగా.. ఆ విషయం తెలుసు కున్న చైర్పర్సన్ వర్గం వారు అక్కడి నుంచి ఆయన్ను తీసుకెళ్లారు.
దీంతో శంకరయ్య కుమారులు తమ తండ్రిని చైర్పర్సన్ వర్గం కిడ్నాప్ చేసిందని మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. వెంటనే శంకరయ్య నగరంలోని చైతన్యపురి పీఎస్కు వెళ్లి తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని.. ఇష్టంతోనే వెళ్లినట్లు వాగ్మూలం ఇవ్వడంతో పోలీ సులు కేసును కొట్టేశారు. అదేవిధంగా ఆదివారం రాత్రి మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ జెర్కోని బాలరాజు ఇంటికెళ్లి వస్తానని చెప్పి చైర్పర్సన్ స్రవంతి వర్గంలో చేరారు. రెండు రోజుల క్రితం వరకు స్రవంతి చైర్పర్సన్ గద్దె నుంచి దిగడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆమె ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కౌన్సిలర్లను తన వర్గంలో చేర్చుకుంటూ పదవిని కాపాడుకుంటున్నారు.
ఈనెల 16న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష నిర్వహిస్తాం. ఇప్పటికే విశ్వాస పరీక్షకు హాజరు కావాలని కౌన్సిలర్ల కు నోటీసులను పంపించడం జరిగింది. బలపరీక్షలో నెగ్గాలంటే 16 మంది సభ్యులు హాజరు కావాలి. లేకపోతే అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటిస్తాం.
-అనంతరెడ్డి, ఆర్డీవో ఇబ్రహీంపట్నం