ఆమనగల్లు, డిసెంబర్ 25 : ఆమనగల్లు మున్సిపాలి టీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారికి ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్ సవాలు విసిరారు. ఆదివారం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపా రు. పట్టణంలోని అంగన్బజార్లో రూ.కోటితో మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణం, కూరగాయలు, చేపలు, మాంసం విక్రయం కోసం రూ.4.50 కోట్లతో 1.04 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పను లు, ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఆమనగల్లు మండల విద్యార్థుల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సొంత భవనం 9.15 ఎకరాల్లో నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలి పా రు.
ఈ పనులన్నీ మీకు కనిపిస్తాలేవా అని ప్రశ్నించా రు. అలాగే మున్సిపాలిటీ ఆభివృద్ధ్దికి టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేయించిన మాట నిజం కాదా అని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చించేందుకు ఎమ్మెల్యే అవసరం లేదని భారత రాష్ట్ర సమితి కార్యకర్త చాలన్నారు. సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ రమేశ్నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జైరాం, గుత్తి బాలస్వామి, కమటం వెంకటయ్య, సాయిలు, జంతుక అల్లాజీ, భీమయ్య, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు కిరణ్, నరేందర్, విఠాయిపల్లి రమేశ్, ప్రసాద్ నాయకులు పూసల భాస్కర్, వెంకటేశ్, కంబాలపల్లి అల్లాజీ, జంతుక గిరి, గునమల్ల రాములు, రాము, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.