ఆమనగల్లు : టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి మహబుబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవం కావడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.