ఆమనగల్లు : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్గిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో తాసిల్దార్ పాండునాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి మంజురైన 22మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పాలనల్లో ఆర్థికబారం లేకుండా తమ బిడ్డలకు ఘనంగా పెళ్లివేడుకలను జరుపుకొంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో ఎక్కడ అలసత్వం కాకుండా అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమపథకాలు అందిస్తున్న సీఎంకేసీఆర్కు ప్రజలంత అండగా నిలువాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, జోగు వీరయ్య, ఏఎంసీచైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అర్జున్రావు, నాయకులు బాలస్వామి, యాదయ్య, వెంకటయ్య, రమేశ్నాయక్లు పాల్గొన్నారు.