ఆమనగల్లు : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు 1973వ సంవత్సరం నుంచి 150 దేశాలలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ శ్యామ్సుందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ శర్మ, ఉపాధ్యక్షులు మల్లేపల్లి జగన్, యాదిలాల్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు, న్యాయవాదులు శేఖర్, రామకృష్ణ, ఆంజనేయులు, కృష్ణ పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
శంకర్పల్లి : మానవుని మనుగడ సజావుగా సాగాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చైర్పర్సన్ మున్సిపాలిటీ పరిధిలో మొక్కలను నాటారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఫతేపూర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
63 వేల మొక్కలు నాటిన ఎన్జీవో
మొయినాబాద్ : మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామంలో సంకల్ప తరు ఫౌండేషన్ వారు ఎస్బీఐ, హెచ్డీబీ ఫైనాన్స్ వారి ఆర్థిక సహకారంతో ప్రభుత్వ భూమిలో 63 వేల మొక్కలను నాటారు. మొక్కలు నాటడంతో పాటు 3 సంవత్సరాలు మొక్కలకు కావాల్సిన సంరక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటడంతో పాటు రైతుకు కావాల్సిన మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి ఎన్జీవో సంస్థ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ ప్రభాకర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సుధాకర్రెడ్డి, యాదయ్య, మేన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సంకల్ప తరు ఫౌండేషన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రమేశ్, ప్రోగ్రాం ఆఫీసర్ శేఖర్, హెచ్డీబీ ఫైనాన్స్ సర్వీస్ ఏసీఎం సత్యనారాయణ దువే, టీఎస్ఎం సతీశ్ బూర్ల, అనీల్రెడ్డి, ఎస్ఎం కొండల్రెడ్డి, విజయభాస్కర్, మహేష్, ఆనంద్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేటలో స్వచ్ఛ ప్రతిజ్ఞ
పెద్దఅంబర్పేట : అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ర్యాలీని చైర్పర్సన్ చెవుల స్వప్నతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ్ షెహర్లో భాగంగా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ (ఆర్ఆర్ఆర్)పై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను తడి, పొడిగా వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్పీలు, ఎస్హెచ్జీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
భావి తరాలకు దివ్య ఔషధం
షాద్నగర్రూరల్ : మనం నేడు నాటే ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు దివ్య ఔషధం అని ఫరూఖ్నగర్ మండలంలోని కమ్మదనం గ్రామ సర్పంచ్ నర్సింహులు అన్నారు. గ్రామంలో మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్య నివారణకు చెట్లు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మానవళి మనుగడకు మొక్కలే ఆధారం
కడ్తాల్ : పుడమిపై మానవళి మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని పేర్కొన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 50 వేల మొక్కలను నాటామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయక్అలీ, వార్డు సభ్యు డు భిక్షపతి, హెచ్ఎం జం గయ్య, రాధాకృష్ణారెడ్డి, నాయకులు లక్ష్మణ్, మల్లేశ్, శ్రీనివాస్, శివ, సిద్ధు, విద్యార్థులు పాల్గొన్నారు.