తాండూరు, జూలై 16: తాండూరు నియోజకవర్గంలో ఆదివారం ఆషాఢమాసం బోనాలను వైభవంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామా ల్లో మహిళలు అమ్మవార్లకు బోనమెత్తి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామదేవతల ఆలయాలను తీరొక్క పూలతో అం దంగా అలంకరించడంతో పాటు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడాదంతా మంచి జరగాలని, పాడి, పంటలు బాగుండాలని కోరుకున్నారు. తాండూరు కాళికామాత దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సావాల్లో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
కొడంగల్: ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ల ఆరాధ్య దేవత పెద్దమ్మతల్లి ఫలారం రథోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ముదిరాజ్ కమ్యూనిటీ భవనం నుంచి అమ్మవారి రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. పోతరాజుల వీరంగం, అశేష జన సందోహం నడుమ అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగలా సాగింది. దారి పొడవునా అమ్మవారిని భక్తులు దర్శించుకొని మంగళహారతులు అందించి అమ్మవారి దీవెనలను అందుకొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని బీటీఎస్ కాలనీ, శివరాంనగర్ కాలనీ, ఇంద్రానగర్ తదితర కాలనీల్లో గ్రామ దేవతలకు ఆదివారం మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. కాలనీల్లో ఉన్న గ్రామ పోచమ్మ, మైసమ్మ తదితర దేవతలకు నైవేద్యాలు సమర్పించారు. ఈ సారి వర్షాలకు కురువాలని, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నారు. బీటీఎస్ కాలనీలో పోచమ్మ ఆలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, కాలనీ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి: మండల కేంద్రంతో పాటు దార్గులపల్లి, రామ్పూర్ తదితర గ్రామాల్లో ఆదివారం గ్రామ దేవతల బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలను అందంగా ముస్తాబు చేసి డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పంటలు బాగా పండాలని, అందరిని చలంగా చూడాలని మొక్కుకున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దోమ: దోమ మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో సర్పంచ్ యశోదా తిరుపతయ్యసాగర్ ఊరడమ్మ దేవతకు వడిబియ్యం సమర్పించి గ్రామం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.
మోమిన్పేట: మోమిన్పేట మండల పరిధిలోని దుర్గంచెరువు గ్రామంలో బోనాల పండుగ వైభవంగా జరుపుకున్నారు. డప్పుచప్పుళ్లు పోతురాజుల విన్యాసాలు, శివస త్తు ల పూనకాలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ దేవతకు నైవేద్యాలు సమర్పించి పూజ లు చేశారు. కార్యక్రమంలో సర్పం చ్ హరిశంకర్, ఉప సర్పంచ్ కిష్టయ్య, ఎంపీటీసీ కుశల్కుమార్, మాజీ సర్పంచ్ వేమారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ధారూరు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వగ్రామం కెరెళ్లిలో ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సబితా ఆనంద్ గ్రామ దేవత పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. డప్పుల వాయి ద్యాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శివ సత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గ్రా మ దేవతల దేవాలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మ వార్లకు నైవేద్యాన్ని సమర్పించారు.
కులకచర్ల: కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో దుర్గాదేవి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమ ర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. డప్పువాయిద్యాలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.రాంపూర్ గ్రామంలో కోట మైసమ్మ బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.