రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ,టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అయి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
తాజాగా సోమవారం కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామానికి చెందిన సర్పంచ్ మహేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతితో నేడు గ్రామాలు అనేక వసతులు, మార్పులు సంతరించుకొని అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయనిమంత్రి పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని, సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్,నాయకులు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి, సురేందర్ రెడ్డి,చంద్ర శేఖర్, గోవర్ధన్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.