వికారాబాద్, మే 17 : నకిలీ విత్తనాల నుంచి రైతులను కాపాడుకోవాల్సిన బా ధ్యత మనందరిపై ఉందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని సమావేశం మందిరం లో జిల్లా వ్యవసాయ అధికారులతో కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మినా, వ్యాపారులకు సహాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టాస్క్పోర్స్ టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ టీమ్, పరిగి, తాండూరు, వికారాబాద్ సబ్ డివిజన్ల వారీగా, సబ్ డివిజన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రై తులు విత్తనాలను లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని వివరించారు. కొనుగోలు చేసిన అనంతరం బిల్లులు తీసుకోవాలన్నారు. ఎవరైనా కల్తీ విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, పరిగి, వికారాబాద్, తాండూరు డీఎస్పీలు కరుణాసాగర్రెడ్డి, సత్యనారాయణ, శేఖర్గౌడ్, ఏడీఏ వినోద్కుమార్, ఏడీఏ కొడంగల్ శంకర్ రథోడ్, సీఐలు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలి
పోలీసులు రాత్రి సమయంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ అధికారులతో క్రైమ్ రివ్యూ, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలతో పాటు జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.