రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రెండోరోజూ శుక్రవారం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సందడిగా సాగింది.
గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఏర్పాటు చేసిన సభల్లో ప్రజలు దరఖాస్తు ఫారాలను నింపి అధికారులకు అందజేశారు. అర్హులందరూ దరఖాస్తుల ఫారాలను నింపి గడువులోగా ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ