Rangareddy | రంగారెడ్డి : కాటేదాన్లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు స్కూల్కు వచ్చి ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలో వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ గుర్రం శంకర్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్కూల్కు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
కాటేదాన్లోని రాకేష్ విద్యా నికేతన్ స్కూల్లో గుర్రం శంకర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు. 10వ తరగతి విద్యార్థినులతో అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారి ముందు వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అయితే ప్రిన్సిపాల్ తీరుతో విసిపోయిన పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను నిలదీశారు. ప్రిన్సిపాల్ దురుసుగా సమాధానం చెప్పడంతో అతనిపై షీ టీమ్స్కు, మైలార్దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.