మహేశ్వరం, జూలై 25 : డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన ఏలె నర్సింగ్రావు (47) మహేశ్వరంలో బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కాగా, హైదరాబాద్కు బోనాల పండుగకు వెళ్లి వస్తుండగా మహేశ్వరం గేట్ దాటిన తర్వాత.. మసీదు వద్ద రోడ్డు డివైడర్కు అతని వాహనాన్ని ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.