Rangareddy | ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 6 : ప్రేమికుడిని బెదిరించి కండ్లముందే అతడి ప్రియురాలిపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది. ప్రేమించిన యువకుడు ఇబ్రహీంపట్నంలో ఉండగా… అతడి కోసం బీహార్ నుంచి వచ్చిన యువతిపై ఈ దారుణ ఘటన జరిగింది. బాలిక మైనర్ కావడంతో పోలీసులు నిందితులపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం… బీహార్ రాష్ర్టానికి చెందిన ఐదుగురు యువకులు ఇబ్రహీంపట్నంలో నివాసముంటూ.. భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇందులో ధర్మేంద్రకుమార్ అనే యువకుడు బీహార్లో ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి నాలుగురోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో ఉంటున్న ధర్మేంద్ర వద్దకు వచ్చింది. ధర్మేంద్రకుమార్ తన స్నేహితులతో కలిసి ఇబ్రహీంపట్నంలోని చిన్నచెరువు పక్కన ఉన్న క్వార్టర్స్లో నివాసముంటున్నాడు. ప్రేమించిన యువతితో కలిసి ధర్మేంద్ర తన రూంకు వెళ్ల్లాడు. వీరు రూంలో ఉండగానే… అతడి పక్క రూమ్లో ఉంటున్న మరో నలుగురు యువకులు అతిగా మద్యం తాగి ఇంట్లో ఉన్న తన ప్రియురాలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. నిస్సహాయ స్థితిలో ధర్మేంద్రకుమార్ 100 నంబర్కు ఫోన్ చేశాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు రంగంలోకి దిగి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు నలుగురు యువకులైన చందన్కుమార్, ధర్మేంద్రతో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు. మైనర్ బాలికలపై గ్యాంగ్రేప్కు పాల్పడిన నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.