బొంరాస్పేట, డిసెంబర్ 16 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొనసాగుతున్న పొదుపు సంఘాల్లో చేరకుండా ఉన్న అర్హత కలిగిన 60 ఏండ్లు, 18 ఏండ్లు నిండిన మహిళలతో వేర్వేరుగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్థికాభ్యున్నతికి కృషి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హత కలిగిన వారితో కొత్తగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో.. క్షేత్రస్థాయిలో అధికారులు కొత్త సంఘాల ఏర్పాటు దిశగా చర్యలను ముమ్మరం చేశారు. స్వ యం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఏటా బ్యాంకు లిం కేజీ ద్వారా, స్త్రీనిధి పథకం ద్వారా కోట్లాది రూపాయలను రుణాలుగా అందిస్తున్నది. రుణాలు పొందిన మహిళలు ఉపా ధి కోసం యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. తాజాగా సంఘాల నుంచి తొలగించబడ్డ 60 ఏండ్లు పైబడిన వారికి, 18 ఏండ్లు నిండిన మహిళలకు కొత్తగా ఏ ర్పాటు చేస్తున్న సంఘాల్లో సభ్యత్వం ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనున్నది.
సాధారణంగా స్వయం సహాయక సంఘాల్లో 60 ఏండ్లు పైబడిన సభ్యులను తొలగిస్తారు. వారికి బ్యాంకు నిబంధనల ప్రకారం రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో సంఘాల నుంచి తొలగించబడ్డ మహిళలు పొదుపు చేసుకోలేక.. ఆర్థిక స్వావలంబనకు దూరమై ఇబ్బంది పడుతున్నారు. వృద్ధా ప్యంలో ఉన్న తమను సంఘా ల నుంచి దూరం చేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని.. తమను కూడా సం ఘాల్లో సభ్యులుగా చేర్చుకోవాలని 60 ఏండ్లు పైబడిన వారి నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం 60 ఏండ్లు దాటిన వృద్ధులతో కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఐకేపీ ఏపీఎంలు, సీసీలు ఆసక్తి గల మహిళలను గుర్తించి వారితో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. వికారాబాద్ జిల్లాలో ఇంతవరకు సంఘాల్లో సభ్యులుగా ఉండి 60 ఏండ్లు నిండడంతో సంఘాల నుంచి తప్పుకున్న వారు 9,600 మంది వరకు ఉన్నారు. వారు చేసే పొదుపును బట్టి ప్రభుత్వం రుణాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 18 ఏండ్లు నిండిన వారితోనూ కొత్తగా సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో 60 ఏం డ్లు, 18 ఏండ్లు నిండిన మహిళలతో వేర్వేరుగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ప్రక్రి య జిల్లాలో చురుగ్గా సాగుతు న్నది. ఇప్పటికే జిల్లాలోని ఏపీఎంలు, సీసీలకు సంఘాల ఏర్పాటుపై ఆదేశాలు ఇచ్చాం. 60 ఏండ్లు నిండిన వారు ఎంతమంది ఉన్నారో మండ లాల వారీగా సమాచారం ఇచ్చాం. వారిలో ఆసక్తి ఉన్నవారితో సంఘాలను ఏర్పా టు చేయాలని సూచించడం జరిగింది. కొత్తగా ఏర్పాటయ్యే సంఘాలకు కూడా ప్రభుత్వం రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. స్వయంశక్తితో సంఘాలను నడుపుకొనే దిశగా వారిని చైతన్యం చేస్తాం.
-రామ్మూర్తి డీపీఎం, వికారాబాద్