రంగారెడ్డి, జూలై 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో 9.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక హయత్నగర్లో 6.2 సెం.మీ, పెద్దఅంబర్పేట్లో 5.9 సెం.మీ, పెద్దషాపూర్లో 4.4 సెం.మీ, తట్టి అన్నారంలో 4.1 సెం.మీ, అరుట్లలో 4.1 సెం.మీ, వనస్థలిపురంలో 4 సెం.మీ, బోడకొండలో 3.6 సెం.మీ, అబ్దుల్లాపూర్మెట్లో 3.4 సెం.మీ, కడ్తాల్లో 2.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.