చకచకా అభివృద్ధి పనులు
నిత్యం చెత్త సేకరణ, ప్రతి వీధిలో కలుపు మొక్కల తొలగింపు
పల్లెంతా పరిశుభ్రం, పచ్చదనం
గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తి
ఆహ్లాదకర అందిస్తున్న పల్లె ప్రకృతి వనం
గ్రామ నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు
‘పల్లె ప్రగతి’తో మారినఈర్లపల్లి గ్రామ రూపురేఖలు
చేవెళ్ల టౌన్, జూలై, 28: ‘పల్లె ప్రగతి’తో ఈర్లపల్లి గ్రామ రూపురేఖలు మారాయి. ప్రతి నెలా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులను చకచకా పూర్తి చేశారు. నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ వీధుల్లో కలుపు మొక్కలు లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. దీంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. ప్రతివీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మించడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. గ్రామ రోడ్డుకు ఇరువైపులా, ప్రతి వీధిలోనూ మొక్కలు నాటారు. వివిధ రకాల మొక్కలతో పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. వైకుంఠధామం, కంపోస్టు యార్డు అందుబాటులోకి వచ్చాయి. త్వరితగతిన గ్రామం అభివృద్ధి చెందడంతో పల్లెజనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాలు అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గ్రా మలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు.
ఆదర్శంగా నిలిచిన ఈర్లపల్లి గ్రామం.
అభివృద్ధే ప్రధానంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈర్లపల్లి గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 1400 జనా భా, 700 మంది ఓటర్లు ఉన్నారు. వైకుంఠధా మం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, చెత్త డంపింగ్ యా ర్డు పనులు పూర్తయ్యాయి. పారిశుధ్య పనులు సక్రమం గా నిర్వహించి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించి, కంపోస్టు షెడ్డులో వేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు.
ప్రతి వీధి అందంగా..
గ్రామంలో ఏ వీధి చూసినా సీసీ రోడ్లతో అందంగా కనిపిస్తున్నది. రోడ్లకిరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో నీటి సమస్య లేకుండా నిరంతరాయంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ సెక్రటరీ రమేశ్బాబు ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేస్తున్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం
ముందస్తు ప్రణాళికలతో అభివృద్ధిలో గ్రామం దూసుకుపోతున్నది. పల్లె ప్రగతి పనులతో గ్రామాలు అందంగా తయారయ్యాయి. గతంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సీసీ కెమెరాలను పంచాయతీ కార్యాలయానికి అను సంధానం చేశాం. మున్ముందు ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
పెండింగ్ సమస్యల పరిష్కారం
పల్లె ప్రగతి కార్యక్రమంలో గతంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాం. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. హరితహారం మొక్కల సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటింటికీ తిరిగి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. కంపోస్టు షెడ్డులో వేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాం. ఆ ఎరువును హరితహారం మొక్కలకు వేసి, వాటికి ప్రతి రోజూ నీటిని పడుతూ సంరక్షిస్తున్నాం. గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తాం.