నిరుపేద కుటుంబంలో పుట్టి సరస్వతి పుత్రులుగా నిలిచారు.. చిన్నప్పటి నుంచే ఏదో సాధించాలన్న తపన.. చదువుపై ఉన్న మక్కువ వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. స్కూల్ నుంచే సివిల్స్పై దృష్టించిన వారు పట్టుదలతో తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకులు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పూడూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన తరుణ్, అష్ఫక్.
తరుణ్ తల్లిదండ్రులు కూలీపని చేసి జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబంలో పుట్టిన అతను ఎలాగైనా పై చదువులు చదివి మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు. అందుకోసం అలుపెరగకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాడు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఏకంగా జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు. అలాగే అష్ఫక్ పదోతరగతి నుంచే సివిల్స్ సాధించి కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ కావాలని అనుకున్నాడు. ఆ దిశగా పట్టుదలతో చదివిన అతను సివిల్స్ సాధించాడు. ప్రతి రోజూ 8-10 గంటలు చదువుతూ.. పలుమార్లు పరీక్షలు రాసినా విజయం వరించలేదు.. అయినా నిరుత్సాహ పడకుండా మరింత పట్టుదలతో చదివి నాలుగోసారి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.
మొదటిసారి పరీక్ష రాసి.. 231 ర్యాంకు సాధించి..
పట్టుబట్టి.. అనుకున్నది సాధించిన గొట్లపల్లి బిడ్డ..పెద్దేముల్, ఏప్రిల్ 17 :తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ జాఫర్, రిజ్వానా బేగం దంపతులకు ఇద్దరు సంతానం. వీళ్లది నిరుపేద కుటుంబం. సుమారు 30 ఏండ్ల క్రితం గొట్లపల్లి నుంచి హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరి కుమారుడు మహ్మద్ అష్ఫక్ను ఉన్నత చదువులు చదివించగా అష్ఫక్ కష్టపడి చదివి ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటారు. దీంతో గ్రామస్తులందరూ ఫోన్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. మహ్మద్ అష్ఫక్ హైదరాబాద్లోని హఫీజ్పేటలో జనప్రియ హైస్కూల్లో 10వ తరగతిని 2015వ సంవత్సరంలో పూర్తిచేశాడు. తదుపరి బాచుపల్లిల్లోని శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో ఇంటర్మీడియట్ను 2017వ సంవత్సరంలో పూర్తిచేశాడు.
అనంతరం న్యూఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో (బీఏ-ఎకనామిక్స్, హానర్స్)ను 2020వ సంవత్సరంలో, న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిన్స్లో (ఎంఏ-ఎకనామిక్స్) పీజీని 2022వ సంవత్సరంలో పూర్తిచేశాడు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత 2020వ సంవత్సరంలో మొదటి సారిగా సివిల్స్ పరీక్షను రాయగా సెలెక్ట్ కాలేదు. 2021లో రాసినా ఫలితం దక్కలేదు. ముచ్చటగా మూడోసారి 2022 సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇంటర్వ్యూ కాల్ అందుకోలేకపోయాడు. ఇలా దాదాపు మూడు సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు నాలుగోసారి 2023వ సంవత్సరంలో ప్రయత్నించిన అతడికి ఆలిండియా లెవల్లో 770వ ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు.
పట్టుబట్టి.. అనుకున్నది సాధించిన గొట్లపల్లి బిడ్డ..
పెద్దేముల్, ఏప్రిల్ 17 :తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ జాఫర్, రిజ్వానా బేగం దంపతులకు ఇద్దరు సంతానం. వీళ్లది నిరుపేద కుటుంబం. సుమారు 30 ఏండ్ల క్రితం గొట్లపల్లి నుంచి హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరి కుమారుడు మహ్మద్ అష్ఫక్ను ఉన్నత చదువులు చదివించగా అష్ఫక్ కష్టపడి చదివి ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటారు. దీంతో గ్రామస్తులందరూ ఫోన్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. మహ్మద్ అష్ఫక్ హైదరాబాద్లోని హఫీజ్పేటలో జనప్రియ హైస్కూల్లో 10వ తరగతిని 2015వ సంవత్సరంలో పూర్తిచేశాడు. తదుపరి బాచుపల్లిల్లోని శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో ఇంటర్మీడియట్ను 2017వ సంవత్సరంలో పూర్తిచేశాడు.
అనంతరం న్యూఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో (బీఏ-ఎకనామిక్స్, హానర్స్)ను 2020వ సంవత్సరంలో, న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిన్స్లో (ఎంఏ-ఎకనామిక్స్) పీజీని 2022వ సంవత్సరంలో పూర్తిచేశాడు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత 2020వ సంవత్సరంలో మొదటి సారిగా సివిల్స్ పరీక్షను రాయగా సెలెక్ట్ కాలేదు. 2021లో రాసినా ఫలితం దక్కలేదు. ముచ్చటగా మూడోసారి 2022 సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇంటర్వ్యూ కాల్ అందుకోలేకపోయాడు. ఇలా దాదాపు మూడు సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు నాలుగోసారి 2023వ సంవత్సరంలో ప్రయత్నించిన అతడికి ఆలిండియా లెవల్లో 770వ ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు.
రోజుకు 8 నుంచి 10 గంటలు చదివాను..
ఐఏఎస్ సాధించాలనే బలమైన కోరికతో కష్టపడి చదువుకుంటూ వచ్చాను. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 10వ తరగతి నుంచి ఎంఏ ఎకనామిక్స్ వరకు నా ఉన్నత చదువులు పూర్తిచేశాను. డిగ్రీ అర్హత ఉంటేనే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది కాబట్టి కష్టపడి చదువుతూ 2020లో డిగ్రీ పూర్తిచేసి, 2022లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. ఒకవైపు ఎంఏ చదువుకుంటూనే 2020వ సంవత్సరం నుంచి సివిల్స్ రాశాను. మూడు సార్లు విఫలమైనా నిరుత్సాహ పడలేదు. 2018వ సంవత్సరం నుంచి ఐఏఎస్ సాధించడానికి సాధనను మొదలుపెట్టాను. నాలుగో ప్రయత్నంలో 770వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐపీఎస్, ఐఆర్ఎస్ సర్వీస్కు అవకాశం వచ్చింది. కానీ నా టార్గెట్ ఐఏఎస్. మున్ముందు మరోసారి సివిల్స్ పరీక్షలను రాసి ఇంకా మంచి ర్యాంకును సాధించి ఐఏఎస్ తప్పకుండా ఎంపికవుతాను. నన్ను ఉన్నతచదువులు చదివించిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల, కళాశాల అధ్యాపకులకు, కోచింగ్ గైడ్ నిపుణులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
-మహ్మద్ అస్ఫక్