రంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో జరుగనున్న కార్యక్రమంలో లక్కీ డ్రా తీసి షాపులను కేటాయించనున్నారు. 2023-25 సంవత్సరానికిగానూ జిల్లాలో 234 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా 21,615 దరఖాస్తులొచ్చాయి.
సరూర్నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 134 మద్యం షాపులకు 10,994 దరఖాస్తులు రాగా అందులో ఎస్సీలకు 11, ఎస్టీలకు 2, బీసీలకు 25, జనరల్కు 96 షాపులను కేటాయించారు. అదేవిధంగా శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 100 మద్యం షాపులకు 10,621 దరఖాస్తులు రాగా ఎస్సీలకు 6, బీసీలకు 9, జనరల్కు 85 షాపులను కేటాయించారు. డ్రా పద్ధతిన మద్యం షాపులను కేటాయిస్తామని కలెక్టర్ హరీశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.