అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో నమోదవుతున్న రోజువారీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1271 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల అనంతపూర్, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 903260కు చేరింది. ప్రస్తుతం 8142 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 7220కు చేరింది.