ఆదిబట్ల, డిసెంబర్ 26 : పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం రావిరాల గ్రామం సమీపంలో కొంత మంది పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదిబట్ల పోలీసులు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు.
పేకాట ఆడుతున్న 20 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7లక్షల 15 వేల నగదుతో పాటు 27 ముబైల్ఫోన్లు, కారు, 3 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరిచనున్నట్లు సీఐ తెలిపారు.