బషీరాబాద్, సెప్టెంబర్ 30: నాబార్డు నిధులతో సహకార సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే రైస్మిల్, గోదాం నిర్మించనున్నట్లు నవంద్గి సహకార సంఘం చైర్మన్ అల్లాపురం వెంకట్రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు, సభ్యుల సహకారంతో ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం వ్యాపార మార్గంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సహకారంతో గోదాం, రైస్మిల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక ఎకరం భూమి కేటాయించిందన్నారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
గోదాం, రైస్మిల్ నిర్మాణానికి నాబార్డు నుంచి రూ. 2 కోట్లు నిధులు సమకూర్చుకోనున్నట్టు తెలిపారు. అలాగే కార్యాలయం ఆవరణలో దుకాణాల సముదాయాన్ని నిర్మించేందుకు, పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు 2022-23 సంవ త్సర జమ, ఖర్చుల పట్టికను, ఆస్తి, అప్పుల పట్టికను, అర్థ సంవత్సరపు అంచనా బడ్జె టును, పాత బకాయల వసూలు, 2021-22 సంవత్సరపు అడిట్ రిపోర్డుల వంటి అం శాలను చర్చించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజారత్నం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, సభ్యులు ఆశోక్ గౌతమ్, హన్మంత్రెడ్డి, నర్సిరెడ్డి, గోపాల్రెడ్డి, సీఈవో వెంకటయ్య ఉన్నారు.