షాబాద్, మార్చి 18: చేవెళ్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 3,855 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 3,843 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 12 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు గైర్హాజరయ్యారు.
షాబాద్ మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో 723 మంది విద్యార్థులకు 722 మంది, చేవెళ్ల మండలంలో ఐదు కేంద్రాల్లో 710 మంది విద్యార్థులకు 707 మంది, మొయినాబాద్ మండలంలో 6 కేంద్రాల్లో 1279 మందికి 1274 మంది, శంకర్పల్లి మండలంలో 6 కేంద్రాల్లో 1143 మందికి 1140 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 18 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోమవారం ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నియోజకవర్గంలోని 28 సెంటర్లల్లో 5790మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా…ఒకరు మినహా మిగతావారంతా పరీక్షలకు హాజరయ్యారు. ఆయా పాఠశాలల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు ఉపాధ్యాయులు తరలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ కూడా ఏర్పాటుచేసి పరీక్షలు సజావుగా జరుగటానికి పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
కడ్తాల్ : మండలంలో మొత్తం 509 మంది విద్యార్థులకు 508 మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షకు హాజరయ్యారని ఎంఈవో సర్దార్నాయక్, నోడల్ అధికారి జంగయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు చందులాల్, అశోక్రెడ్డి, శ్రీనివాస్, డిపార్ట్మెంట్ అధికారులు శ్రీధర్, చల్మారెడ్డి, కృష్ణయ్య తెలిపారు. తలకొండపల్లి మండలంలో 356 మంది విద్యార్థులకు 353 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలో 10, ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద, కొత్తూరు మండలంలో మూడు, నందిగామ మండలంలో ఒకటి, కేశంపేట మండలంలో మూడు, కొందుర్గు మండలంలో రెండు, చౌదరిగూడ మండలంలోని పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4228 మంది విద్యార్థులకు 4203 మంది పరీక్షకు హాజరరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్ శంకర్రాథోడ్ తనిఖీ చేశారు.
కొత్తూరు : కొత్తూరు జడ్పీహెచ్ఎస్ ఏ సెంటర్లో 200 మంది విద్యార్థులకు 198 మంది, బీ పెంటర్లో 194 మందికి 193 మంది పరీక్ష రాశారు. మాంటిస్సోరీ హైస్కూల్లో 160 మంది విద్యార్థులకు గాను మొత్తం విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 551 మంది విద్యార్థులు పరీక్ష రాశారని ఆయన తెలిపారు.
ఆమనగల్లు : రెండు సెంటర్లలో 560 మంది విద్యార్థులకు 559 మంది హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ పాండు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐ బాల్రామ్నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.