కులకచర్ల, జనవరి 30 : నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు స్టడీమెటీరియల్ను ఉచి తంగా అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్రెడ్డి అన్నారు. సోమవారం చౌడాపూర్ మండల పరిధిలోని చాకల్ పల్లి, కొత్తపల్లి, మరికల్, మందిపల్, చౌడాపూర్ ఉన్నత పాఠ శాలల్లో చదువుతున్న విద్యార్థులకు బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా స్టడీమెటీరియల్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని విధా లుగా మౌలిక సదుపాయాలు ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా చేపడుతుందని వివరించారు. కార్య క్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కమతం శ్రీనివాస్రెడ్డి, కుల కచర్ల జడ్పీటీసీ రాందాస్నాయక్, కులకచర్ల పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ చౌడాపూర్ మండల అధ్య క్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, మందిపల్ గ్రామ సర్పంచ్ మఠం ప్రమీల, చౌడాపూర్ గ్రామ సర్పంచ్ రంగారెడ్డి, మరికల్ గ్రామ సర్పంచ్ పాండురంగయ్య, బీఆర్ఎస్ నాయకులు రాజప్ప, ఆంజనేయులు, కొండయ్య, రవీందర్, మాలె కృష్ణగౌడ్, రవీం దర్రెడ్డి, మొగులయ్య, కృష్ణయ్య, మఠం రాజశేఖర్, శంకర య్య, యాదయ్య, నర్సింలు, లక్ష్మయ్య, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రాంలాల్, ప్రధానోపాధ్యాయులు రాములు, తిమ్య నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.