కడ్తాల్, ఫిబ్రవరి 12: సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకొని సన్మార్గంలో నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంతకుముందు ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీక్యానాయక్ అన్నదానం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీలు దశరథ్నాయక్, అనురాధ, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, శంకర్, హంశ్యమోత్యానాయక్, వెంకటేశ్వర్లుగౌడ్, రామునాయక్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డి, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు చందోజీ, భాస్కర్రెడ్డి, హన్మానాయక్, సురేందర్రెడ్డి, రాజాగౌడ్, లక్పతినాయక్, పత్యానాయక్, అనిల్యాదవ్, నర్సింహ, భిక్షపతి, రామచంద్రయ్య, లాయక్అలీ, సేవ్యానాయక్, వెంకటయ్యగౌడ్, రాజునాయక్, రతన్నాయక్, పాండునాయక్, జాన్యానాయక్, యాదయ్య, సత్యం, రామకృష్ణ, రవికాంత్గౌడ్, రమేశ్, జగన్ పాల్గొన్నారు.
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు
మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉదయం స్వామి వారికి అఖండ దీపారాధన, ధ్వజారోహణం, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారిని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకుని, స్థానిక నాయకులతో కలిసి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీని ఆలయ నిర్వాహకులు, నాయకులు సన్మానించారు. ఉత్సవాల్లో వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు చెన్నకిషన్రెడ్డి, సురేందర్రెడ్డి, చందోజీ, శ్రీకాంత్రెడ్డి, నరేందర్రెడ్డి, నరేశ్నాయక్, కృష్ణ, వెంకటేశ్, మహేందర్గౌడ్, శాయిరెడ్డి, జంగారెడ్డి, కమల్నాథ్రెడ్డి, మహేశ్, భానుకిరణ్, ఆలయ అర్చకులు వెంకటేశ్వరశర్మ, తిరునగరి రఘురాం, వేణుగోపాల్, శ్రీధర్, శ్రీమన్నారయణ, భక్తులు పాల్గొన్నారు.
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆమనగల్లు, ఫిబ్రవరి12 : కడ్తాల, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలానికి చెందిన సైదులుకి రూ.60వేలు, సయ్యద్ అక్తర్కు రూ.36వేలు, ఇర్విన్ గ్రామానికి చెందిన నర్సింహ్మకు రూ.40వేలు, కడ్తాల మండలంలోని మైసిగండికి చెందిన కవితకు రూ.26వేలు మంజూరయ్యాయి. అనంతరం మాడ్గుల మండలంలోని కలకొండ గ్రామానికి చెందిన పలువురు నాయకులు దుర్గామాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్సీకి ఆహ్వానపత్రికను అందజేశారు.