షాద్నగర్, అక్టోబర్ 10 : దసరా పండుగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. వాసవి మాత దేవాలయంలో శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అమ్మవారి కృపతో పాడి పంటలు పుష్కలంగా పండాలని, వ్యాపార అభివృద్ధి సాధించాలని కోరారు. ప్రజలు సుఖసంతోషాలతతో ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఆర్య వైశ్య సంఘం నాయకులు రమేశ్, నందకిశోర్, సుధాకర్, శ్రీనివాస్గుప్తా, అనంతలక్ష్మి, నవీన్ పాల్గొన్నారు.
దుర్గామాతకు పూజలు
షాబాద్, అక్టోబర్ 10 : గ్రామాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దుర్గామాత విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మహేందర్గౌడ్ భక్తులకు అన్నదానం చేశారు. హైతాబాద్, సర్దార్నగర్, తాళ్లపల్లి, మల్లారెడ్డిగూడ గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
లలితా పరమేశ్వరి దేవిగా అమ్మవారు..
మండల కేంద్రంలోని రచ్చబండ వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి అవతారంలో దర్శనమిచ్చింది. మోడల్ స్కూల్ విద్యార్థులతో అమ్మవారి మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు.
భక్తి శ్రద్ధలతో దేవీనవరాత్రి ఉత్సవాలు
మండలంలోని ఇన్ముల్నర్వ, పెంజర్ల, కొత్తూరు, తిమ్మాపూర్, తీగాపూర్ గ్రామాల్లో ఆయా యువజన సంఘాలు, భవానీమాత సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కొత్తూరు మండల కేంద్రంలోని జైభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
లలితాత్రిపుర సుందరిదేవీగా అంబభవానీ
ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామల్లో దేవీనవరాత్రోత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఎలికట్ట అంబభవానీ దేవాలయంలో అదివారం అమ్మవారిని లలితాత్రిపుర సుందరిదేవి రూపంతో అలకరించి పూజలు చేశారు.