షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 6: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని మంటప నిర్వాహకులు, భక్తులకు షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ సూచించారు. స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్లో సోమవారం పట్టణ సీఐ నవీన్కుమార్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవ కమిటీలు, మంటపా ల నిర్వాహకులతో శాంతి సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మంటపాల నిర్వాహకులు వారి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ దరఖాస్తులో పొందుపరిచి పోలీస్స్టేషన్లో అనుమతులు తీసుకోవాలన్నారు. మండపంలో విద్యుత్, మైకుల ఏర్పాటుకు మీసే వ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో ఎవరైనా ఒకరు తప్పకుండా మం టపాల వద్ద ఉండాలన్నారు. మండపాల వద్ద పోలీసుల ఫోన్ నంబర్లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజున డీజేలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీలైనంత వరకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేలా చూడాలన్నారు. గణేశ్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సుందరయ్య, ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్, ఏఎస్ఐలు కృష్ణయ్య, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్, సర్వర్పాషా, నాయకులు నందకిషోర్, బాబర్ఖాన్, ఇజాజ్, యాదగిరి, మహేందర్రెడ్డి, చెట్ల వెంకటేశ్, ప్రదీప్, మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.