పెద్దేముల్, నవంబర్ 1:మండల పరిధిలోని ఆయా గ్రా మాల్లో వరి పంటను సాగు చేసిన రైతన్నలు కోతలకు సిద్ధ మవుతున్నారు. వానకాలంలో 2,592 మంది రైతులు 4,30 2 ఎకరాల్లో దొడ్డురకం, కామన్ రకం వరి పంట లను సాగు చేస్తున్నారు. రేగొండిలో 347 ఎకరాల్లో, పెద్దే ముల్లో 322 , దుగ్గాపూర్లో 307, కందనెల్లిలో 301, గాజీపూర్లో 188, మారేపల్లిలో 184, గొట్లపల్లిలో 182. కొండాపూర్లో 177, ఖానాపూర్లో 134, గిర్మాపూర్లో 81, బుద్దారంలో 54, మదనంతాపూర్లో 52, రుక్మా పూర్లో 51, పాషాపూర్లో 36, తట్టేపల్లిలో 32, అడికి చెర్లలో 17, ఇం దూరులో 05, మన్సాన్పల్లిలో 05, హ న్మాపూర్లో 2.23, రుద్రారంలో 1.14, తింసాన్పల్లిలో 01 ఎకరాలో రైతన్నలు వరి పం టల ను సాగు చేస్తు న్నా రు. ఈసారి 1,07,551 క్వింటాళ్ల వరి ధాన్యం పండే అవ కాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 15 తర్వాత వరి కొను గోలు కేంద్రాలను ప్రారంభించడానికి ప్రభుత్వం చర్య లు చేపడుతున్నట్టు అధికారులు తెలుపుతున్నారు.
గతంలో వరి ధాన్యం “ఏ” గ్రేడ్ రకం రూ.1888 మద్దతు ధర పలుకగా, కామన్ రకం రూ.1868 పలికింది. రైతులు ధాన్యాన్ని కొను గోలు కేంద్రానికి తీసుకొచ్చేటప్పుడు పలు నాణ్యత ప్రమా ణాలను తప్ప కుండా పాటించాలని అధి కారులు సూచిస్తు న్నారు. వరి ధాన్యాన్ని ఆరబెట్టి, చెత్తతాలు, మట్టి పెళ్లలు, రాళ్లు లేకుండా శుభ్ర పరుచుకొని తీసుకు రావాలని సూచి స్తున్నారు.
నాణ్యత పాటించాలి..
మండల పరిధిలోని ఆయా గ్రామా ల్లో మొత్తం 4,302 ఎకరాల్లో సుమా రు 2,592 మంది రైతులు వరి పం టలను సాగు చేస్తున్నారు. పంటలు ప్రస్తుతం కోత దశకు వచ్చాయి. సుమారు 10 వేల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరిం చడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ తప్పకుండా కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయ డా నికి ప్రస్తుతం చర్యలు చేపడుతున్నది. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్ప కుండా పాటిం చాలని సూచిస్తున్నాం.
-షేక్ నజీరోద్దీన్, మండల వ్యవసాయ అధికారి, పెద్దేముల్