కేశంపేట, మార్చి 11 : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. కేశంపేటలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించి భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు అధికారులకు సూచించారు.
ఎన్నికలో టీచర్స్ ప్రశాంతంగా ఓటు వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ను పరిశీలించి పోలీసుల పనితీరు, క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్, రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ధనుంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.