ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 : టీఆర్ఎస్ బలోపేతానికి నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల యాదగిరి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23, 24వార్డుల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24వార్డులున్నాయని, వీటిలో 13వార్డులకు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వార్డు కమిటీలు పూర్తిచేసి మున్సిపల్ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. 22వ వార్డు అధ్యక్షుడిగా చందా కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రవి, 23వ వార్డు అధ్యక్షుడిగా డండేటికార్ నర్సింగ్రావు, ప్రధాన కార్యదర్శిగా నీలం వెంకటేష్, 23వ వార్డు అధ్యక్షుడిగా ఎండీ జహంగీర్, ప్రధాన కార్యదర్శిగా వినోద్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్వేతబాలు, బాలరాజు, యాచారం సుజాత రవీందర్, నీల్ల భానుబాబు, నాయకులు మహేశ్గౌడ్, నీలం బాలు, చందు, ముజాకిర్ పాల్గొన్నారు.
ఆర్కపల్లిలో..
ఆమనగల్లు (మాడ్గుల), సెప్టెంబర్ 6 : మండలంలోని ఆర్కపల్లి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ, అనుబంధ కమిటీలను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పవన్కుమార్రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ రాజవర్ధన్రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే జమిల్, ఉపాధ్యక్షుడు సీత బిక్కు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, సహాయ కార్యదర్శి బద్రితో పాటు కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, వెంకటయ్య, జానీ, చెన్నయ్య, జంగయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బిక్కయ్య, యూత్ విభాగం అధ్యక్షుడు బిక్కు, కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు.
మంచాల గ్రామ అధ్యక్షుడిగా రాజేష్
మంచాల సెప్టెంబర్ 6: మంచాల మండలం దాత్పల్లి, మంచాల గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన గ్రామకమిటీలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాలరమేశ్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. మంచాల గ్రామ అధ్యక్షుడిగా గడ్డం రాజేష్, ప్రధాన కార్యదర్శిగా రావుల ప్రవీణ్, దాత్పల్లి గ్రామ అధ్యక్షుడిగా నేనావత్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి పాలకూర వెంకటేష్ గౌడ్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బహదూర్, సహకార సంఘం చైర్మన్పుల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మొగిలివెంకటేష్, జంబుల కిషన్రెడ్డి, జ్ఞానేశ్వర్, మహేందర్రెడ్డి, మైసయ్య, పరమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో
ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 6 : మండల పరిధిలోని ఉప్పరిగూడ, రాయపోల్, పోచారం గ్రామాల టీఆర్ఎస్పార్టీ నూతన కమిటీలను ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాయపోల్ గ్రామశాఖ అధ్యక్షుడిగా డొంకని బాలుగౌడ్, ఉపాధ్యక్షుడిగా మంత్రి ఆంజనేయులు, కార్యదర్శిగా చింత నవీన్రెడ్డి, టీఆర్ఎస్ ఉప్పరిగూడ అధ్యక్షుడు నల్లొల రమేష్, ఉపాధ్యక్షుడిగా మడుపు శ్రీశైలం, కార్యదర్శిగా బొడుసు వెంకటేష్యాదవ్, పోచారం గ్రామశాఖ అధ్యక్షుడిగా గొరిగె రమేష్, ఉపాధ్యక్షుడిగా వినోద్కుమార్, కార్యదర్శిగా దేవరకొండ మహేశ్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, నాయకులు మంఖాల దాసు, జగదీశ్వర్, సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఎంపీటీసీలు శ్రీశైలం, జ్యోతి, ఉపసర్పంచ్లు భగీరథ్, బూడిద నర్సింహారెడ్డి, అచ్చన బాలరాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 6: టీఆర్ఎస్ పటిష్టతకు కృషి చేయాలని కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ అన్నారు. కొత్తూరు మండలపరిధిలోని సిద్దాపూర్, శేరిగూడబద్రాయపల్లి, కొడిచర్ల గ్రామాల్లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి ఆధ్వర్యంలో గ్రామాల వారీగా టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, టీఆర్ఎస్ మండల గ్రామకమిటీల ఇన్చార్జి షాద్నగర్ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నారాయణరెడ్డి, యాదగిరిరావు, శేఖర్ పంతులు హాజరయ్యారు. సిద్దాపూర్ టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా ఎస్.రెడ్యా నాయక్, ఉపాధ్యక్షుడిగా నవాజ్రెడ్డి, శేరిగూడబద్రాయపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడిగా కె.పాండు, ఉపాధ్యక్షుడిగా తిరుపతయ్య ముదిరాజ్, కొడిచర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇటమోని జంగయ్య యాదవ్, ఉపాధ్యక్షుడిగా కళ్లెం రామకృష్ణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిద్దాపూర్ సర్పంచ్ వడ్డె తులసమ్మ, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, పీఏసీఎస్ వైస్చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, నాయకులు డి.జంగయ్య, నర్సింహ, అజయ్, కృష్ణయ్య, నర్సింహారెడ్డి, జంగయ్యయాదవ్, జనార్ధన్యాదవ్, మోహన్రెడ్డి, దశరథచారి, హర్ష, శేఖర్ పాల్గొన్నారు.
సుందరాపురంలో
కేశంపేట, సెప్టెంబర్ 6 : మండల పరిధిలోని సుందరాపురం టీఆర్ఎస్ గ్రామ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా బాసాని కస్పాల్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎన్.రవీందర్నాయక్, కార్యదర్శిగా కోటిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కె.కృష్ణారెడ్డి, కోశాధికారిగా డి.కృష్ణారెడ్డిలతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములునాయక్, పార్టీ నాయకులు టి.వెంకటేశ్వర్రెడ్డి, యారం శేఖర్రెడ్డి, బాలకోటిరెడ్డి పాల్గొన్నారు.
జిల్లెడు చౌదరిగూడ మండలంలో
కొందుర్గు, సెప్టెంబర్ 6 : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని చేగిరెడ్డి ఘనాపూర్, చింతకుంటతండా, ముష్టిపల్లి గ్రామాల్లో నూతన టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సయ్యాద్ హఫీజ్ తెలిపారు.
కొందుర్గులో …
కొందుర్గు మండలంలోని రేగడి చిల్కమర్రి, ముట్పూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ, అనుబంధ కమిటీలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నూతన కమిటీ ఎన్నికల ఇన్చార్జి దర్గా రామచంద్రయ్య, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, కో ఆప్షన్ మెంబర్ నర్సింగరావు, నాయకులు రాములు, నారాయణయాదవ్, జబ్బార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మైత్రి కుటీర్ కాలనీ అధ్యక్షుడిగా మహేందర్రెడ్డి
పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 6: మున్సిపాలిటీ పరిధిలోని మైత్రి కుటీర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా ఎం.మహేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సుద్దాల ఎల్లయ్య, కోశాధికారిగా అనిల్, గౌరవాధ్యక్షుడిగా జి సురేందర్, ఉపాధ్యక్షులుగా నరేందర్కుమార్, శివాజి, జాయింట్ సెక్రటరీగా కీర్తి, సభ్యులుగా ప్రతాప్, రాజిరెడ్డి, వెంకట్రెడ్డి, సరోజ, వెంకన్న, శివారెడ్డి, మల్లారెడ్డి, మాధవరెడ్డి, ఆంజనేయులు ఎన్నికయ్యారు.