పెద్దఅంబర్పేట, మార్చి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు ఆత్మబంధువు అయ్యారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ గ్రామ చౌరస్తాలో బుధవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రశాంత్కుమార్రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంటికీ నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. తారామతిపేట్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్, మన ఊరు- మనబడి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.7.67 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
మహిళా సంఘాల సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు డ్వాక్రా భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. దేశంలోని సమస్యలపై సీఎం కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉన్నదని, తెలంగాణ తరహాలో దేశాన్ని అభివృద్ధి చేసేందుకే ఆయన బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చారని చెప్పారు. దేశంలోని మేధావులంతా సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రశాంత్కుమార్రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గురువారం ఉదయం యాత్ర మున్సిపాలిటీలోని పసుమాముల, కుంట్లూరులో కొనసాగింది. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రై తు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అక్బర్ భాషా, ఎంపీటీసీ చేగూరి వెంకటేశ్యాదవ్, ఉపసర్పంచ్ గొశిక నర్సింహ పాల్గొన్నారు.