షాద్నగర్టౌన్, జూలై 16 : హరితహారంలో భాగంగా నాటుతున్న మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే 11, 18 వార్డులో మున్సిపల్ కమిషనర్ లావణ్య, సీడీపీవో నాగమణి, కౌన్సిలర్లు శారద, ప్రేమలతతో కలిసి మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలన్నారు. హరితహారం ద్వారా మున్సిపాలిటీలోని ప్రతి వార్డు పచ్చదనంతో కళకళలాడుతున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు యుగేందర్, జమృత్ఖాన్, శేఖర్ పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ
మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని సర్పంచ్ శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా శుక్రవారం శంకర్పల్లి, షాబాద్ హైవేపై 1200 మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ శైలజాఆగిరెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పంచాయతీ పరిధిలో ఇప్పటికే లక్ష్యానికి మించి మొక్కలు నాటామన్నారు. మొక్కల సంరక్షణకు అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకట్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు నారాయణ, పుష్పలత పాల్గొన్నారు.