ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో, వాడవాడలా చలువ పందిర్లు వేసి సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయాల కమిటీలు, ఆయా సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17 : సీతారాముల కల్యాణం సందర్భంగా నియోజకవర్గంలో బుధవారం పెద్ద ఎత్తున సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కనుల పండువగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి తమ స్వగ్రామమైన తొర్రూరులో సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. ఎలిమినేడు గ్రామంలో జరిగిన కల్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.
పట్టువస్ర్తాలను సమర్పించిన ఎమ్మెల్యే
కొత్తూరు : సీతారాముల కల్యాణాన్ని కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలో కనుల పండువగా నిర్వహించారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల అనంతపద్మనాభస్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, మామిడి సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్బీపల్లిలో నిర్వహించిన కల్యాణంలో జడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
షాబాద్ : షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో సీతారాముల కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాంపూర్ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య సీతారాముల కల్యాణం జరిపించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, టీటీడీ బోర్డుమెంబర్ గడ్డం సీతారెడ్డి, జడ్పీటీసీ అవినాశ్రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మండల వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సీతారాంపూర్ మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, దేవాదాయశాఖ ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : గ్రామాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముడిమ్యాల్ గ్రామంలోని కోదండరామాలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామివార్లకు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి కల్యాణం జరిపించారు. పామెన గ్రామంలో సాయిబాబా ఆలయంలో సీతారాములకు మాజీ సర్పంచ్ దావల్గారి గోపాల్రెడ్డి దంపతులు కల్యాణం జరిపించారు. ఆలూర్, మల్కాపూర్ గ్రామల్లో ఎంపీటీసీ గోపులారం యాదమ్మపోచయ్య, బకా ్కరెడ్డి రవీందర్రెడ్డి సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో సీతారాముల కల్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
షాద్నగర్టౌన్ : పట్టణంలోని గోదా సమేత లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని ఆలయ నిర్వహకులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమెల్యేలు వై. అంజయ్యయాదవ్, ప్రతాప్రెడ్డి, బక్కని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పట్టువస్ర్తాలను సమర్పించారు. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద శోభాయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కడ్తాల్ : మైసిగండి గ్రామంలో కల్యాణోత్సవానికి ముందు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ వారు పంపించిన పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలకు మైసమ్మ ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, ఈవో స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని అంగడి బజార్లోని హనుమాన్ ఆలయం, పట్టణ సమీపంలోని అంతిరింతుర గుట్టపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, అయ్యసాగరం క్షేత్రంలోని శ్రీరామాలయం, పోలేపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, భోజన వితరణ చేశారు. కార్యక్రమాలలో జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ గుప్తా, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.