కరోనా మహమ్మారి బుసలు కొడుతుండడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయలవుతున్నారు. కొందరి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. ఇలాంటి సమయంలో సినిమా సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. రీసెంట్గా కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు తమిళ నటులు సూర్య, కార్తీ ముందుకొచ్చారు. రూ. కోటి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. సోదరులిద్దరూ తమ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్తో కలసి బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు విరాళం అందజేశారు.
ఇక తాజగా తమిళ దర్శకుడు మురుగుదాస్ కరోనా రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి స్టాలిన్కు రూ. 25 లక్షల చెక్ అందించారు. కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు చిన్న సాయం అందించాను అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలంటూ కూడా పేర్కొన్నారు. కాగా మురుగదాస్ ఒకప్పుడు టాప్ డైరెక్టర్ స్థానంలో ఉండగా,ఇప్పుడు ఆయనకు పెద్దగా ఆఫర్స్ ఏమి రావడం లేదు.