అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. జెంగ్జౌ నగరంలో మూడు రోజుల్లో ఒక ఏడాదికి సరిపడా వర్షాన్ని చవిచూసిన పరిస్థితి నెలకొన్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు.