రాష్ట్ర అవతరణకు ముందు ఉరిసిల్లగా పేరొందిన సిరిసిల్ల నేడు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ పండుగల వస్ర్తోత్పత్తులతో పాటు స్కూల్ యూనిఫాం వస్ర్తాల తయారీలో ఏటా మరమగ్గాలకు పని లభిస్తుంది. నేతగాడు 15 వేలనెలసరి వేతనం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. దీనితో ప్రతి నేత కుటుంబానికి చేతినిండా ఉపాధి లభిస్తున్నది. వలసలు తగ్గిపోయినయి.
రాష్ట్ర అవతరణ తర్వాత టెస్కోకు పాలకవర్గం లేదు. కనీసం కార్పొరేషన్లకు పాలకవర్గాలను ఏర్పాటుచేస్తే చేనేత ప్రతినిధుల నిర్వహణలో అట్టడుగు కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా మరింతగా సేవలందించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో చేనేత రంగం మరింత వేగంగా ముందుసాగే అవకాశం కూడా ఉన్నది.
రాష్ట్ర అస్తిత్వంలో చేనేత కళకు ప్రత్యేక స్థానం ఉన్నది. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పోచంపల్లి, పుట్టపాక, గద్వాల, నారాయణపేట, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల వంటి చేనేత కేంద్రాల వస్ర్తోత్పత్తుల ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఇక్కడి ప్రాంత చేతి వృత్తి కళాకారుల ఉనికి, సమస్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరంతరం నిపుణులతో అనేక సమాలోచనలు జరిపారు. అందువల్లనే రాష్ట్ర అవతరణ అనంతరం కేసీఆర్ దార్శనికత వల్ల వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయి.
చేనేత మంత్రి కేటీఆర్ పిలుపునందుకున్న యువతరం వారానికోసారి చేనేత వస్ర్తాలు ధరిస్తూ చేనేతరంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ పిలుపుతో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, మధ్య తరగతి వర్గం చేనేత బట్టల వినియోగాన్ని పెంచింది. చేనేత కార్మికులకు చేతినిండా పని లభిస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ చేనేత వస్ర్తాలకు ఆన్లైన్లో మార్కెట్ పెరిగింది. సోషల్ మీడియా ద్వారా ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వినియోగదారులు నిర్ణీత ధరలకు వస్ర్తాలు పొందగలుగుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 20 వేల చేనేత మగ్గాలతో పాటు 40 వేల మరమగ్గాల మీద 60 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయల విలువైన వస్ర్తోత్పత్తి మన రాష్ట్రంలోనే జరుగుతున్నది. 336 చేనేత సహకార సంఘాలతో పాటు టెస్కో అనే చేనేత మార్కెటింగ్ సంస్థ పనిచేస్తున్నది.
మగ్గాల లెక్కలు: సంక్షేమ అభివృద్ధి పథకాలకు లబ్ధిదారుల సంఖ్య ఎంతో అవసరం. ఆ విషయాన్ని గుర్తెరిగి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత మగ్గాల, మరమగ్గాల సంఖ్యను శాస్త్రీయంగా డాక్యుమెంట్ చేసింది. కార్తీ సంస్థ సహకారంతో రాష్ట్రంలోని కార్మికుల ఫొటో వివరాలతో పాటు ప్రతి మగ్గానికి ఒక జియో టాగ్ వేశారు. ఇది దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగింది. నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి ఈ డిజిటల్ డాటా ఎంతగానో ఉపకరిస్తుంది. రాష్ట్ర చేనేత జౌళిశాఖ వెబ్సైట్లో ప్రతి నేతగాడి వివరాలు ఫొటోతో సహా నిక్షిప్తమై ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మగ్గాల లెక్కల వల్ల ప్రతి కార్మికుడికి ఒక ప్రత్యేక నంబర్తో గుర్తింపు లభించింది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఒక యూనిక్ ఐడీగా ఉపకరిస్తుంది. అందరికి న్యాయం లభించే అవకాశం ఏర్పడుతుంది. నిజమైన నేత కార్మికులకు నేరుగా ప్రయోజనం లభిస్తుంది. నెలకు రూ.4 వేల లబ్ధి చేకూరుతుంది. ఇది చేనేత కార్మిక కుటుంబాలకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే ఆన్లైన్ దరఖాస్తు పద్ధతి వల్ల మధ్యవర్తుల ప్రమేయంతో కార్మికులకు ప్రయోజనం నేరుగా లభించడం లేదని కొందరి వాదన. ఈ సమస్య నివారించేందుకు రైతుబంధు మాదిరిగా చేనేత బంధు పథకం ద్వారా నేతన్నలకు నేరుగా నగదు బదిలీ చేయాలని కార్మికులు కోరుతున్నారు.
సిరిసిల్ల ప్యాకేజీ: రాష్ట్ర అవతరణకు ముందు ఉరిసిల్లగా పేరొందిన సిరిసిల్ల నేడు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ పండుగల వస్ర్తోత్పత్తులతో పాటు స్కూల్ యూనిఫాం వస్ర్తాల తయారీలో ఏటా మరమగ్గాలకు పని లభిస్తుంది. నేతగాడు 15 వేల నెలసరి వేతనం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. దీనితో ప్రతి నేత కుటుంబానికి చేతినిండా ఉపాధి లభిస్తున్నది. వలసలు తగ్గిపోయి నయి. జియోటాగ్ పొందిన కార్మికుడు పొదుపు పథకంలో చేరి లబ్ధి పొందుతున్నాడు. ఏడాదికి సుమారు 400 కోట్ల రూపాయల విలువైన వస్ర్తోత్పత్తుల ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ మే ఇస్తున్నది. ఇది నేత కుటుంబాల్లో ఆత్మస్తైర్యం నింపింది. ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టా యి. అనేక సంక్షేమ పథకాల మూలంగా నేత కుటుంబాల పిల్లలు చదువుకోగలుగుతున్నా రు. నేత కూలీలను సొంత మగ్గాల యజమానులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యే క ప్యాకేజీ ప్రకటించింది. దీంతోపాటు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ సాకారమైతే నేతన్నలకు ఉపాధి మరింత పెరుగుతుంది.
కార్పొరేషన్ల ఏర్పాటు: చేనేత వస్ర్తోత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రస్తుతం ఉనికిలో ఉన్న టెస్కో స్థానంలో చేనేత కార్పొరేషన్, పవర్లూం కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కార్పొరేషన్లు పని ప్రారంభిస్తే నేత కార్మికులకు మరింత నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయి. రాష్ట్ర అవతరణ తర్వాత టెస్కోకు పాలకవర్గం లేదు. కనీసం కార్పొరేషన్లకు పాలకవర్గాలను ఏర్పాటుచేస్తే చేనేత ప్రతినిధుల నిర్వహణలో అట్టడుగు కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా మరింతగా సేవలందించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో చేనేత రంగం మరింత వేగంగా ముందుసాగే అవకాశం కూడా ఉన్నది.
కర్నాటి విద్యాసాగర్