ఒక పోస్టల్ స్టాంపు దేశభక్తికి చిహ్నంగా మారింది. కోట్ల మంది ప్రజానీకం ఉద్వేగపు సంకేతంగా నిలిచింది. దుకాణాల ముందు గంటలపాటు వేచిచూస్తూ పదుల సంఖ్యలో ఆ స్టాంపులను కొంటున్నారు జనం. ఇదంతా ఉక్రెయిన్లో జరుగుతున్నది. ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణ మొదలైన తర్వాత.. స్నేక్ ఐలాండ్ అనే ద్వీపం వద్దకు రష్యా యుద్ధనౌక ‘మోస్కా’ వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఉక్రెయిన్ తీరప్రాంత గస్తీ దళాల్ని లొంగిపొమ్మని హెచ్చరించింది. కానీ, ఉక్రెయిన్ సైనికులు నిర్భయంగా ఎదురునిలిచారు. వేలు చూపిస్తూ, ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ పొలికేక పెట్టారు.
ఇది జరిగి రెండు నెలలైంది. ఆ తర్వాత కాలంలో ఆ భద్రతా దళాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. ఉక్రెయిన్ ఎదురుదాడిలో యుద్ధనౌక మోస్క్వా సముద్రంలో మునిగిపోయింది. యుద్ధనౌకను ఎదిరించిన సైనికుల వీరత్వానికి చిహ్నంగా ఉక్రెయిన్ విడుదల చేసిన పోస్టల్ స్టాంపు దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. టీషర్టులు, టీ మగ్గుల మీద కూడా స్టాంపులను ప్రింట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజలకు ఇప్పుడీ స్టాంపు స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నది.