అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్న పదం సుస్థిర ప్రభుత్వం. బలమైన సర్కార్ ఏర్పడితే సుపరిపాలనకు నాంది పడుతుంది. రాజకీయ సంక్షోభానికి తావులేకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి సారించవచ్చు. గత తొమ్మిదేండ్లలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని రుజువు చేసింది.
స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయంగా తిరుగుబావుటా ఎగురవేసిన దాఖలాల్లేవు. తత్ఫలితంగా రాష్ట్రం అన్నివిధాలుగా పురోగమించింది. జీఎస్డీపీ 14 లక్షల కోట్ల వరకు ఎగబాకింది. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. సాగు, స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయంలో విప్లవాత్మక ప్రగతి సాధించింది. తెలంగాణ తప్ప, దేశంలో 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. చెరువులు నిండుగా మారి మత్స్యకారులు, అన్నదాతలకు అదరువుగా నిలుస్తున్నాయి. ఐటీ ప్రగతి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. అందుకే ప్రజలు ఇప్పుడు సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే లాభం ఏమిటి? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే వచ్చే నష్టాలు ఏమిటని బేరీజు వేసుకుంటున్నారు.
కాంగ్రెస్కు ప్రత్యేకంగా శత్రువులెవరూ ఉం డరు. ఆ పార్టీ నాయకులే ఒకరికొకరు కత్తులు దువ్వుకుంటూ, ఆధిపత్యం కోసం పంచాయతీలు పెట్టుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీలో ఇదే పంథా కనిపిస్తున్నది. నిత్యం కలహాల్లో తలమునకలై ఉండే హస్తం నేతలు ప్రజలకు పాలనాపరమైన సమస్యలను తెచ్చిపెడుతుంటారు. వీళ్ల అస్థిరత గురించి ప్రజలు ఎన్నో ఉదాహరణలను నెమరు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో అధికారాన్ని చెలాయిస్తున్నది. సుపరిపాలన ఏమో కానీ, కుమ్ములాటలు, అలకలకే నాయకులు సమయం మొత్తా న్ని వెచ్చిస్తున్నారు. అధికార వ్యామోహంతో కలి గే సమస్యలపై దృష్టిపెడుతూ, ప్రజలను పట్టించుకోవడమే లేదు. రాజస్థాన్లో గత ఐదేండ్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ముళ్ల కుర్చీపైనే కూర్చున్నారు. పార్టీ, పదవుల్లో ఆధిప త్యం కోసం ఆయనకు, ఆ పార్టీ అగ్రనేత సచిన్ పైలట్ల మధ్య నిత్యం వర్గ పోరు నడిచింది. ఆ తర్వాత 2020లో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పైలట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం గెహ్లాత్కు వ్యతిరేకం గా సచిన్ పైలట్ 2023లో ధర్నాకు దిగారు. ఇం తలోనే అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ చీఫ్ ఎన్నికల రేసులోకి వస్తారని ఊహాగానాలు వచ్చాయి. సీఎం పీఠాన్ని వదిలుకునేందుకు గెహ్లాత్ ఒప్పుకోలేదు. ఆయన వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలతో స్పీకర్కు రాజీనామాలను ఇప్పించారు. వాటిని స్పీకర్ ఆమోదించకపోవడంతో ప్రభు త్వం నిలబడింది. ఈ ఘటనతోనే కాంగ్రెస్ పెద్ద లు ఏఐసీసీ అధ్యక్షుడి కోసం మల్లిఖార్జున ఖర్గే వైపు మొగ్గు చూపారు.
ఛత్తీస్గఢ్లో సీఎం భూపేష్ భగేల్, డిప్యూటీ సీఎం సింగ్దేవ్ల మధ్య పెత్తనం కోసం పోరు నడిచింది. సీఎం పీఠాన్ని పంచుకొమ్మనే ఒప్పందం ఉందని సింగ్దేవ్ వర్గం నిత్యం తమ అసమ్మతిని తెలియజేసేది. చివరాఖరికి సింగ్దేవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అధిష్ఠానం నచ్చజెప్పింది. ఈ రెండు రాష్ర్టాలతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం కోసం నిత్యం కమల్నాథ్, జ్యోతిరాధిత్య సింథియాల నడుమ తగాదాలు ఉండేవి. సీఎం కుర్చీ దక్కలేదన్న అసంతృప్తితో జ్యోతిరాధిత్య సింథియా హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఈయన బాటలోనే ఆరుగురు మంత్రు లు సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం కుప్పగూలింది. గోతికాడ నక్కల్లా అధికారం కోసం వెంపర్లాడుతున్న బీజేపీ, వీరి మద్దతును కూడగట్టుకొని మధ్యప్రదేశ్లో అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక ఇటీవల అధికారం చేపట్టిన కర్ణాటకలోనూ కాంగ్రెస్ పరిస్థితి మారకపోవడం ఆ పార్టీ క్రమశిక్షణను తెలియజేస్తున్నది.
ఇవ్వన్నీ ఒకెత్తయితే, తెలంగాణ కాంగ్రెస్ దుస్థితి మరో ఎత్తు.కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అనే జోక్ తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్నది. ప్రతి నాయకుడు ఇక్కడ సీఎం కుర్చీ కోసం తహతహలాడేవారే. ఒకరికి ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకుంటారు. చిన్నస్థాయి సమావేశాల్లో కూడా సభామర్యాదల మీదికంటే, కుర్చీలు విరగ్గొట్టుకోవడం మీదే వీరికి ధ్యాస ఎక్కువ.
కాంగ్రెస్ వ్యవస్థ అంతా డబ్బు మీదే నడుస్తున్నదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా ప్రకటి స్తున్నారు. కోట్లు పెట్టి, రేవంత్రెడ్డి పీసీసీ పీఠా న్ని కొనుగోలు చేశారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మండిపడ్డారు. డబ్బు సంచులు పోతేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని, ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ రాజీనామాలు చేస్తున్నారు. గాంధీభవన్ను ముట్టడిస్తున్నారు. ఎన్నికల రణరంగం ఏమో కానీ, గాంధీభవన్లో సిగపట్లకే సమయం సరిపోవడం లేదు. ఎలక్షన్ ముందు వాతావరణమే ఇలా ఉంటే, పుసుక్కు న కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నా రు. నిత్యం కొట్లాటలతో కొత్త సమస్యలు తెచ్చే నాయకులకు అధికారాన్ని అప్పగిస్తే, పూర్వపు అంధకారం మళ్లీ వస్తుందని మాట్లాడుకుంటున్నారు. సుస్థిరపాలన అందిం చే బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని వాళ్లు భావిస్తున్నారు.
అక్కల మనోజ్
97001 76866