ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, ర్యాంకులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి ఉత్తమ ర్యాంకు వచ్చింది. దేశంలో ఓడీఎఫ్ ప్లస్(ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ)లో మన రాష్ట్రమే నెంబర్ వన్గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం 2023 మార్చి 12 నాటికి నిర్వహించిన తాజా సర్వేల్లో మరోసారి తెలంగాణ ప్రతిభ తేటతెల్లమైంది. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు, ఓడీఎఫ్ హౌస్ హోల్డ్స్ విభాగాల్లో 100 శాతం స్వచ్ఛత కనబరిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలోనూ వంద శాతం స్వచ్ఛతను నమోదు చేసింది.
దేశంలో పట్టణాలు, నగరాలు, మహానగరాలను మినహాయించి మొత్తం 5,82,903 గ్రామాలున్నాయి. అందులో 2021 డిసెంబర్ 31 నాటికి కేవలం 26,138 గ్రామాల్లో మాత్రమే మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. కానీ, దేశంలో స్వచ్ఛభారత్ ప్రారంభించిన 2014 ఏడాదిలోనే జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మాత్రం, కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికల ప్రకారం 100 శాతం అనూహ్య ప్రగతిని సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రం గా ఆవిర్భవించింది.
దేశంలో అత్యధిక టాయిలెట్స్ ఉన్న 5 రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇదంతా కేవలం తొమ్మిదేండ్లలోనే సాధ్యమైంది. ఇంత తక్కువ కాలంలో అత్యంత ప్రతిభ కనబరిచి ఈ మైలురాయిని దాటడం విశేషం. ఇదిలా ఉంటే, మన పల్లె సీమలు మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. డబుల్ ఇంజిన్తో పనిలేకుండానే డబుల్ ప్రతిభను ప్రదర్శించాయి. ఇదే విషయాన్ని ‘డబుల్ ఇంజిన్కు, డబుల్ పనిచేస్తున్న సర్కార్లకు ఇదీ తేడా…’ అంటూ మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయ న బృందాన్నీ అభినందించారు. మరోవైపు సీఎం కేసీఆర్ దార్శనిక పథకం ‘పల్లె ప్రగతి’ ద్వారానే ఇది సాకారమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
ఓడీఎఫ్ ప్లస్ అంటే..: కేవలం మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్గా ప్రకటిస్తారు. ఆ తర్వాతి దశ అయిన ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్యార్డుల్లో తడి పొడి చెత్తగా వేరుచేయడం, చెత్తను సేకరించడానికి ప్రతి గ్రామానికి ట్రాక్టర్ సమకూర్చడం, శ్మశానవాటికను నిర్మించడం, ఇంకుడుగుంతలు నిర్మించి రోడ్లపై నీళ్లు నిలువకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. ఈ అన్ని విభాగాల్లోనూ మన రాష్ట్రం దేశంలో ముందున్నది కాబట్టే ఈ అవార్డులు వస్తున్నాయి.
స్వచ్ఛ భారత్ మిషన్: మన దేశంలో 2014 అక్టోబర్ 2న గాంధీజీ 145వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) ప్రారంభమైంది. 2019 అక్టోబర్ నాటికి దేశంలో బహిరంగ మల విసర్జనను అంతం చేయడం కోసం 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఐదేండ్లలో 39 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రెండు విడుతలుగా ఇచ్చే 12 వేలలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తున్నాయి.
దేశంలోనే మొదటి గ్రామంగా ముఖరా(కె): అయితే, 2020 జూలై 22 నాటికే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామం మొదటి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా ఎంపికైంది. అంతేకాదు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కూడా ఈ గ్రామ వీడియోలు, ఫొటోలను తన పోర్టల్లో పోస్టు చేసింది. ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ’ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆ గ్రామ సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్లను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్కు పిలిపించుకొని అభినందించారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు’ను మీనాక్షి, సుభాష్ గాడ్గెలు ఈ మధ్యే అందుకున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు రాష్ట్రం లో ప్రతి గ్రామం ముఖరా(కె)గానే మారింది. అనేక రంగాల్లో రాష్ర్టానికి కేంద్రం అందిస్తున్న అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనం. ఒక్క ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్లోనే కాదు, అన్నిరంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నది.
తెలంగాణ నెంబర్ వన్: ఇక దేశంలో పట్టణాలు, నగరాలు, మహానగరాలను మినహాయించి మొత్తం 5,82,903 గ్రామాలున్నాయి. అందులో 2021 డిసెంబర్ 31 నాటికి కేవలం 26,138 గ్రామాల్లో మాత్రమే మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ఇది 04.48 శాతమే. కానీ, దేశంలో స్వచ్ఛభారత్ ప్రారంభించిన 2014 ఏడాదిలోనే జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మాత్రం, కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికల ప్రకారం, దేశంలో మిగతా రాష్ర్టాలకు, మొ త్తం దేశానికి మించి 100 శాతం అనూహ్య ప్రగతిని సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఐరాస ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి, దేశం 2019 నాటికి 100 శాతం లక్ష్యా న్ని నిర్దేశించుకొని అతి తక్కువ శాతం సాఫల్యతతో పనిచేస్తుండగా, తెలంగాణ రాష్ట్రం ఆ రెం డు లక్ష్యాలను మించి, 2021 నాటికే దాదాపు వంద శాతానికి చేరుకోవడం, ఇప్పుడు పూర్తి లక్ష్యాన్ని సాధించడం అసాధారణ విషయం. ఇక తెలంగాణ తర్వాత తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మిజోరం, సిక్కిం, అండమాన్ నికోబార్లు కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. దేశంలో, మిగతా రాష్ర్టాల్లో ఓడీఎఫ్ నత్తనడకన నడుస్తుంటే, తెలంగాణలో మాత్రం శరవేగంగా పూర్తిచేసింది.
సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం: ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం, పటిష్ఠమైన పరిపాలన వల్ల తెలంగాణ అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. బహిరంగ మల విసర్జన రహిత రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. ఈ క్రెడిట్ కేసీఆర్కే చెందుతుంది. మరోవైపు తనదైన శైలిలో అందరినీ ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖలను నిర్వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్రావుల నాయకత్వం, నిరంతరం పనిచేస్తున్న సంబంధిత శాఖల అధికారులు, కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది చేస్తున్న కృషిని ఏ మాత్రం విస్మరించలేం.
పల్లెలకు పరిపాలనా సంస్కరణలు: అయితే, స్థానిక పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేవిధంగా తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం,. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, ఇంటింటికీ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మిషన్ భగీరథ మంచినీరు, నర్సరీలు, డంపింగ్యార్డులు, పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి.
పల్లెప్రగతి నవశకానికి నాంది!: ఇదేగాక, ఇలాంటి అనేక లక్ష్యాలను సాధించిన పల్లె ప్రగ తి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గతంలో ఎక్క డా, ఎన్నడూ లేని వినూత్న పథకాలు. నిజంగా గ్రామీణాభివృద్ధిలో పల్లెప్రగతి నవశకానికి నాం దిగా నిలిచింది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు విడతలుగా పల్లె, నాలుగు విడతలుగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు పండుగలా జరిగాయి. ప్రజాప్రతినిధులంతా ప్రజలతో భాగస్వాములయ్యారు. దీంతో నిరంతర పారిశుధ్యం జరుగుతున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను సంపూర్తిగా రాష్ట్రం అమలు చేస్తున్నది. తద్వారా సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఓడీఎఫ్లో సాధించిన ప్రగతి రాష్ర్టాన్ని తప్పకుండా ఆరోగ్య తెలంగాణగా మారుస్తుందనడం అతిశయోక్తి కాదు. ఈ దిశగా మనమం తా ఆలోచిద్దాం. ఆచరిద్దాం.